ఏడో రోజు ప్రశాంతంగా లాక్డౌన్
కరోనా కట్టడి కోసం రాష్ట్ర ప్రభుత్వం తలపెట్టిన లాక్డౌన్ షాద్నగర్, చేవెళ్ల, ఇబ్రహీంపట్నం ఆమనగల్లు ని యోజకవర్గాలో సంపూర్ణంగా కొనసాగుతున్నది. ప్రతిరోజు ఉదయం 6 నుంచి 10గంటల వరకు దుకాణాలు, వ్యా పార సముదాయాలు తెరిచి ఉంచుతున్నారు. లాక్డౌన్ సమయంలో అనవసరంగా రోడ్లపైకి రావొద్దని పోలీసులు వాహనాదారులకు సూచించారు. పది తర్వాత ప్రజలందరూ ఇంటికే పరిమితమవడంతో రోడ్లన్నీ నిర్మానుష్యంగా మారాయి. పలు చెక్పోస్ట్ల వద్ద వాహనాలను పోలీసులు తనిఖీ చేశారు. లాక్డౌన్ సమయంలో ఇంటి నుంచి ఎవరూ బయటకు రావొద్దని హెచ్చరించారు. రద్దీగా కనిపించే ముంబై-బెంగళూరు లింకు జాతీయ రహదారితో పాటు హైదరాబాద్-బీజాపూర్ రహదారులు జనాలు లేక నిర్మానుష్యంగా కనిపించాయి.