షాద్నగర్, జూన్15: తెలంగాణ రైతుల అభివృద్ధే లక్ష్యంగా సీఎం కేసీఆర్ పాలన కొనసాగుతున్నదని రైతు సమన్వయ సమితి మం డల అధ్యక్షుడు వెంకట్రెడ్డి అన్నారు. రైతు బంధు నిధులు విడు దల కావడం పై హర్షం వ్యక్తం చేస్తు ఫరూఖ్నగర్ మండలం కొం డన్నగూడ గ్రామంలోని రైతు వేదిక ఆవరణలో సీఎం కేసీఆర్ చిత్రపటానికి క్షీరాభిషేకం చేశారు. రైతు బంధు పథకం ప్రారంభం నాటి నుంచి సాగు విస్తీర్ణం పెరిగిందని, పంట దిగుబడితో పాటు రైతులు లాభాల బాటలో ఉన్నారని చెప్పారు. ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ శ్రీనివాస్యాదవ్, మార్కెట్ కమిటీ డైరెక్టర్ పాపయ్యయాదవ్, గ్రామ రైతులు పాల్గొన్నారు.
కరోనా ఆపత్కాలంలోనూ సంక్షేమ పథకాలు
కరోనా ఆపత్కాలంలోనూ సంక్షేమ పథ కాలు ఆగడం లేదని ప్రజా శ్రేయస్సే ప్రథమ కర్తవ్యంగా సీఎం కేసీ ఆర్ కృషి చేస్తున్నారని రైతు బంధు సమితి మండలాధ్యక్షుడు బర్కల రాంరెడ్డి పేర్కొన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా రైతు బంధు పెట్టు బడి సాయం కింద డబ్బు రైతుల ఖాతాల్లో జమ అవుతుండడంతో మంగళవారం రైతు బంధు సమితి మండలాధ్యక్షుడు బర్కల రాం రెడ్డి, నియోజకవర్గ టీఆర్ఎస్ యూత్ అధ్యక్షుడు వనం లక్ష్మీకాం త్రెడ్డి, టీఆర్ఎస్ మండలాధ్యక్షుడు పెద్దొళ్ల ప్రభాకర్, సర్పంచ్లు, ఎంపీటీసీలు సీఎం కేసీఆర్ చిత్రపటానికి క్షీరాభిషేకం చేశారు.