రంగారెడ్డి, మే 12,(నమస్తే తెలంగాణ): జిల్లాలో ఇంటింటి జ్వర సర్వే ముమ్మరంగా కొనసాగుతున్నది. కరోనా వైరస్ను ఆదిలోనే తుద ము ట్టించేందుకుగాను రాష్ట్ర ప్రభుత్వం ఇంటింటి సర్వేను చేపట్టిన విషయం తెలిసిందే. అయితే జిల్లాలో ఇంటింటి ఫీవర్ సర్వేలో భాగంగా పలు వాస్త వాలు వెలుగులోకి వస్తున్నాయి. అయితే కరోనా లక్షణాల కంటే భయంతో వచ్చే లక్షణాలే చాలా మందిలో ఉన్నట్లు వైద్యారోగ్య శాఖ గుర్తించింది. ఫీవర్ సర్వేలో భాగంగా అధికంగా ఒళ్లు నొప్పులు, తలనొప్పి, జలుబు, దగ్గు లక్ష ణాలు ఉన్నవారే అధికంగా ఉన్నట్లు తెలుస్తున్నది. అయితే జ్వరం ఉన్నవారి సంఖ్య చాలా తక్కువగా ఉండగా, కొంతమంది గొంతు నొప్పి కూడా ఉం దని చెబుతున్నట్లు వైద్య బృందాలు చెబుతున్నాయి. అయితే జ్వరం లక్షణం చాలా తక్కువ మందిలో ఉండడంతో జిల్లా వైద్యారోగ్య శాఖ అధికారులు ఊపిరి పీల్చుకుంటున్నారు. సర్వేలో వెల్లడవుతున్న లక్షణాలు అంతా సీరి యస్ కాకపోవడంతో లక్షణాలను బట్టి మందులను వైద్య బృందాలు అంద జేస్తున్నాయి.
మరోవైపు ఎక్కువ మంది భయంతో అనారోగ్యాన్ని కొని తెచ్చుకుంటున్నట్లు సర్వే ద్వారా బయటపడుతుంది. పక్కింటి వారికి, కుటుంబంలో, బంధువులలో ఎవరికి కొవిడ్ పాజిటివ్ నిర్ధారణ అయినా తమకు కొవిడ్ వస్తుందేమోనన్న భయమే ఎక్కువ మందికి ఉన్నట్లు వెల్లడవుతుంది. అంతేకాకుండా భయంతో గుండె నొప్పి ఉందని సర్వే బృం దాలకు చెబుతున్న వారి సంఖ్య కూడా అధికంగా ఉన్నట్లు వైద్యారోగ్య శాఖ అధికారులు చెబుతున్నారు. భయంతోనే శ్వాస సంబంధమైన సమస్యలు వస్తున్నాయని, భయం వీడితేనే కొవిడ్ పాజిటివ్ బారిన పడిన వారు కూడా త్వరగా కోలుకోగలరని జిల్లా వైద్యారోగ్య శాఖ అధికారులు సూచిస్తున్నారు. అంతేకాకుండా కరోనా వస్తుందనే భయం వీడండని ప్రజలకు ఇంటింటి సర్వేకు వెళ్తున్న బృందాలు కూడా సూచిస్తున్నాయి.
ఇప్పటివరకు 3.41 లక్షల ఇండ్ల సర్వే…
గత వారం రోజులుగా జిల్లాలో ఇంటింటి జ్వర సర్వే కొనసాగుతున్నది. జిల్లాలో ఇప్పటివరకు 3,41,931 ఇండ్లకు సంబంధించి సర్వేను పూర్తి చేశారు. సంబంధిత సర్వేను 1103 బృందాలు నిర్వహిస్తున్నాయి. పంచా యతీ కార్యదర్శులు, ఏఎన్ఎంలు, ఆశావర్కర్లతో కూడిన బృందాలు సర్వే నిర్వహిస్తున్నాయి. సర్వేలో భాగంగా పేరు, ఆధార్ నెంబర్, జ్వరం, దగ్గు, జలుబు, దీర్ఘకాలిక వ్యాధులు తదితర 22 ప్రశ్నలతో కూడిన వివరాలను బృందాలు సేకరించి ఎప్పటికప్పుడు ఆన్లైన్లో నమోదు చేస్తున్నారు. మరోవైపు రెండు రోజుల్లో 3.41 లక్షల ఇండ్ల సర్వే నిర్వహించగా, 5104 మందికి కొవిడ్ లక్షణాలున్నట్లు ఆరోగ్య సర్వే బృందాలు గుర్తించాయి. కొవిడ్ లక్షణాలున్న వారికి వెంటనే కిట్స్ను అందించడంతోపాటు లక్షణాల తీవ్రతను బట్టి హోంఐసొలేషన్లో ఉండాలా, ఐసొలేషన్ కేంద్రంలో చికిత్స తీసుకోవాలనేది సూచనలు చేస్తున్నారు. నాలుగు రోజుల తర్వాత కూడా లక్షణాలున్నట్లయితే కొవిడ్ పరీక్షలు నిర్వహించనున్నారు.
సర్వేలో భాగంగా కుటుంబ సభ్యులందరి శరీర ఉష్ణోగ్రతలను తెలు సుకొని, సాధారణం కంటే అధికంగా ఉన్నట్లయితే జ్వరంతోపాటు జలుబు, దగ్గు ఉన్నట్లు తేలితే వారికి మందులు అందజేస్తున్నారు. అదేవిధంగా లక్షణాల తీవ్రత అధికంగా ఉన్నట్లయితే ఐసొలేషన్ కేంద్రానికి వెళ్లాలని సూచిస్తున్నారు. లక్షణాల తీవ్రత తక్కువగా ఉన్నట్లయితే హోంఐసొలేషన్లో ఉంచుతూ ప్రతిరోజు వారి ఆరోగ్య పరిస్థితులపై ఆరా తీస్తున్నారు. అదేవిధంగా కొవిడ్ లక్షణాలున్నట్ల యితే పారాసిటమాల్, యాంటీబయోటిక్స్, మల్టీ విటమిన్ మందులు ఇస్తున్నారు. నాలుగు రోజులపాటు పర్యవేక్షించి లక్షణాలు తగ్గనట్లయితే కొవిడ్ పరీక్షలు నిర్వహించి 12 రకాల స్టెరాయిడ్ ట్యాబ్లెట్లతో కూడిన కిట్ను అందజేస్తున్నారు. లక్షణాల తీవ్రత అధికంగా ఉన్నట్లయితే వెంటనే ర్యాపిడ్ పరీక్షలను కూడా నిర్వహించేందుకు అవసరమైన ఏర్పా ట్లను కూడా జిల్లా వైద్యారోగ్య శాఖ చేసింది. మరోవైపు జిల్లాలోని మున్సి పాలిటీల్లోనూ వార్డుల వారీగా సర్వే నిర్వహిస్తున్నారు.
సరిపోను మందులున్నాయి..
జిల్లాలో ఇంటింటి ఫీవర్ సర్వేను 1103 బృందాలు నిర్వహిస్తున్నాయి. లక్షణాల తీవ్రతను బట్టి ర్యాపిడ్ టెస్టులను గ్రామాల్లోనే నిర్వహిస్తాం. అంతేకాకుండా లక్షణాలను బట్టి 12 రకాల మందుల కిట్స్ను అంది స్తున్నాం. అయితే జిల్లాలో సరిపోను కిట్స్ ఉన్నాయని, సోమవారం నుంచి జిల్లాలోని అర్బన్ పరిధిలో జీహెచ్ఎంసీ వారు కిట్స్ అందిం చనున్నారు, గ్రామీణ ప్రాంతంలో జిల్లా వైద్యారోగ్య శాఖ ద్వారా కిట్స్ను అందించనుంది. అదేవిధంగా ప్రజలెవరూ భయపడొద్దని, కొవిడ్ లక్షణాలు అధికమైన, శ్వాస సమస్య ఏర్పడిన వెంటనే సమీపంలోని పీహెచ్సీకి వెళ్లాలి.