కొత్తూరు, ఏప్రిల్ 11 : కార్యకర్తలంతా కలిసికట్టుగా పనిచేసి కొత్తూరు మున్సిపాలిటీలో టీఆర్ఎస్ జండా ఎగురవేయాలని ఎమ్మెల్యే అంజయ్యయాదవ్ అన్నారు. మున్సిపల్ ఎన్నికల సందర్భంగా కొత్తూరులోని ఓ ఫంక్షన్ హాల్లో ఆదివారం సన్నాహక సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ మున్సిపల్ ఎన్నికల్లో టికెట్ ఎవరికిచ్చినా అందరూ కలిసికట్టుగా పనిచేసి టీఆర్ఎస్ను గెలిపించాలని ఆయన కార్యకర్తలకు పిలుపునిచ్చారు. టికెట్ కేటాయింపులో అనేక విషయాలను పరిగణనలోకి తీసుకుంటామని ఆయన చెప్పారు. అలాగే సర్వే నిర్వహించి గెలుపు గుర్రాలకే టికెట్ కేటాయిస్తామని ఎమ్మెల్యే వివరించారు. 12 వార్డుల్లో అన్నింటిలో టీఆర్ఎస్నే గెలిపించాలన్నారు. అలాగే టీఆర్ఎస్ అధికారంలోకి వచ్చిన తర్వాత జరిగిన అభివృద్ధిని ప్రజలకు వివరించి ఓట్లు అడుగాలన్నారు. ప్రతి వార్డులో 20 మంది కార్యకర్తలు ఇంటింటికీ తిరిగి ప్రతి ఒక్కరిని కలిసి ఓట్లు అభ్యర్థించాలన్నారు. రాష్ట్రంలో టీఆర్ఎస్ అధికారంలో ఉంది కాబట్టి కొత్తగా ఏర్పడిన మున్సిపాలిటీలో మరింత అభివృద్ధి జరుగుతుందన్నారు. జడ్పీ వైస్ చైర్మన్ ఈట గణేశ్ మాట్లాడుతూ కొత్తూరు గ్రామం పంచాయతీగా ఉన్నప్పుడు ఎంతో అభివృద్ధి సాధించిందన్నారు. కొత్తగా ఏర్పడిన మున్సిపాలిటీలో మరింత అభివృద్ధి జరుగాలంటే టీఆర్ఎస్ గెలుపుతోనే సాధ్యమన్నారు.
కాంగ్రెస్ నుంచి టీఆర్ఎస్లోకి జోరుగా వలసలు
టీఆర్ఎస్ పార్టీలో ప్రతి కార్యకర్తకు గుర్తింపు ఉంటుందని ఎమ్మెల్యే అంజయ్యయాదవ్ అన్నారు. మున్సిపల్ ఎన్నికల సన్నాహక సమావేశం సందర్భంగా కొత్తూరు, తిమ్మాపూర్కు చెందిన కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు 50 మంది ఎమ్మెల్యే సమక్షంలో టీఆర్ఎస్లో చేరారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ టీఆర్ఎస్ ప్రభుత్వం చేస్తున్న, సంక్షేమ కార్యక్రమాలను చూసే టీఆర్ఎస్లో చేరుతున్నారని చెప్పారు. ఎన్నికల సందర్భంగా ఎంతో మంది టీఆర్ఎస్లో చేరుతున్నారు. పార్టీలో చేరిన తర్వాత కొత్త, పాత అనేది ఉండదని.. అందరూ కలిసి పనిచేయాలన్నారు. కార్యక్రమంలో షాద్నగర్ మున్సిపల్ చైర్మన్ నరేందర్, ఎంపీపీ మధుసూదన్రెడ్డి, మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ నారాయణరెడ్డి, తిమ్మాపూర్ ఎంపీటీసీ చింతకింది రాజేందర్గౌడ్, టీఆర్ఎస్ సీనియర్ నాయకులు ఎమ్మె సత్యనారాయణ, సుఖేందర్రెడ్డి, మాజీ ఎంపీటీపీ దేవేందర్యాదవ్, నాయకులు జనార్దనచారి, రవినాయక్, గోపాల్నాయక్, రైతు బంధు సమితి మండలాధ్యక్షుడు కృష్ణయ్యయాదవ్ పాల్గొన్నారు.
ఇవీ కూడా చదవండి…
దామెర పీహెచ్సీ ఆరోగ్య సంజీవని