షాద్నగర్టౌన్, ఏప్రిల్ 5: అడవిలో తిరగాల్సిన జింక షాద్నగర్ ము న్సిపాలిటీ పరిధిలోని జీడివడక తండా సమీపంలోని మామిడితోటలో ప్ర త్యక్షమైంది. సోమవారం తండా సమీపంలోని తోటలో తిరుగుతున్న జింకను గుర్తించిన తండావాసులు ఫరూఖ్నగర్ కమ్మదనం అటవీశాఖ బీట్ ఆఫీసర్ అజీజ్కు సమాచారం అందించారు. బీట్ ఆఫీసర్ అజీజ్ అక్కడకు చేరుకుని తోట యజమాని, కౌన్సిలర్ శ్రీనివాస్తో పాటు పోలీ స్ కానిస్టేబుల్ రవి, పలువురితో కలిసి జింకకు ఎలాంటి హానికాకుండా చాక చక్యంగా పట్టుకున్నారు.కాగా జింకపై కుక్కలు దాడి చేశాయని తండావాసులు ఆయనకు వివ రించారు. కుక్కల దాడిలో జింక స్వల్పంగా గాయ పడినట్లు గుర్తిం చిన ట్టు తెలిపారు. జింక విషయం తెలుసుకున్న తండా వాసులు దానిని చూసేందుకు ఎగబడ్డారు. స్థానికులు జింక దాహార్తిని తీర్చారు. జింకను జూపార్కుకు తరలిస్తామని అటవీశాఖ బీట్ ఆఫీసర్ అజీజ్ తెలిపారు. జింకను పట్టుకునేందుకు సహకరించిన వారిని అభినందించారు.
ఇవీ కూడా చదవండి…
జగిత్యాల జిల్లా సిరిపూర్లో స్వచ్ఛంద లాక్డౌన్