నందిగామ : రంగారెడ్డి జిల్లా నందిగామ మండలం కాన్హాశాంతి వనంలోని శ్రీరామచంద్ర మిషన్ (హార్ట్పుల్నెస్ ఇన్స్టిట్యూట్) సంస్థకు తెలంగాణ రాష్ట్ర కొవిడ్-19 వారియర్ అవార్డు లభించింది. ఈ అవార్డును రాష్ట్ర పురపాలక, ఐటీ శాఖ మంత్రి కేటీఆర్, నటుడు సోనూసూద్ల చేతుల మీదుగా హైదరాబాద్లో మంగళవారం నిర్వహించిన సమావేశంలో అవార్డును అందుకున్నట్లు సంస్థ ప్రతినిధులు నందకీశోర్, మధుసూధన్రెడ్డి తెలిపారు. కొవిడ్ విజృంభిస్తున్న సమయంలో శ్రీరామచంద్ర మిషన్ (హార్ట్పుల్నెస్ ఇన్స్టిట్యూట్) ద్వారా 11 లక్షల మందికి ఉచితంగా భోజనం అందించడంతో పాటు మరో 8 లక్షల మంది నిరుపేదలకు భోజనాలు, 3 లక్షల భోజనాలు వీధి కుక్కలకు అందిచినట్లు తెలిపారు.
వీటితో పాటు 14 రాష్ట్రాల్లో 38 ప్రదేశాల్లో సుమారు 7 లక్షల మంది ఆరోగ్య కార్యకర్తలకు ఎన్-95 మాస్కులను, 2500 పీపీఈ కిట్లు పంపిణీ చేసిట్లు వివరించారు. తెలంగాణ సోషల్ ఇంపాక్ట్ గ్రూప్, తెలంగాణ ప్రభుత్వ విభాగం ఈ సేవా కార్యక్రమాలను గుర్తించి అవార్డుల వేడుక నిర్వహించినట్టు తెలిపారు.