కడ్తాల్ : మండల పరిధిలోని మైసిగండి మైసమ్మతల్లి ఆలయానికి సంబంధించిన హుండీ ఆదాయాన్ని శుక్రవారం జిల్లా దేవాదాయశాఖ అధికారులు లెక్కించారు. దేవాదాయశాఖ జిల్లా సహాయ కమిషనర్ భాస్కర్, ఇన్స్పెక్టర్ ప్రణీత్కుమార్ సమక్షంలో అమ్మ వారి హుండీ లెక్కింపును నిర్వహించారు. 62రోజులకు సంబంధించిన హుండీ ఆదాయన్ని లెక్కించగా, రూ. 12,22,146ల ఆదాయం వచ్చిన్నట్లు ఆలయ ఈవో స్నేహలత, ట్రస్ట్ చైర్మన్ శిరోలీపంతూనాయక్ తెలిపారు. హుండీ వచ్చిన మొత్తాన్ని కడ్తాల్ మండల కేంద్రంలోని కెనరాబ్యాంక్లో జమ చేస్తున్నట్లు వారు తెలిపారు.
ఈ కార్యక్రమంలో ఆలయ ఫౌండర్ ట్రస్టీ రమావత్ శిరోలీ, ఆలయ నిర్వాహకులు ఆర్పీ భాస్కర్నాయక్, అరుణ్కుమార్, ఆలయ సిబ్బంది యాదగిరిస్వామి, బోడియ్యనాయక్, కృష్ణ, రాములు, చంద్రయ్య, దేవేందర్, రమాదేవి, శ్రీనివాసులు, వెంకటేశ్, బాలు, హర్షవర్ధన్, రవీందర్, మహేశ్, విజయ్, రామకృష్ణ, కృష్ణయ్య, శ్రీను, హర్షవర్ధన్, పత్యానాయక్, రవీందర్ పాల్గొన్నారు.