కడ్తాల్, జూన్ 18, (ఆమనగల్లు) : ప్రజా సంక్షేమానికి రాష్ట్ర ప్రభుత్వం పెద్దపీట వేసిందని ఎమ్మెల్యే జైపాల్యాదవ్ అన్నారు. శనివారం ఆమనగల్లు పట్టణంలోని రైతు వేదిక వద్ద కల్యాణలక్ష్మి, షాదీముబారక్ చెక్కులను 68 మంది లబ్ధిదారులకు అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్రంలో అన్ని వర్గాల అభ్యున్నతికి రాష్ట్ర ప్రభుత్వం కృషి చేస్తున్నదని పేర్కొన్నారు. కార్యక్రమంలో జడ్పీటీసీలు అనురాధ, విజితారెడ్డి, ఏఎంసీ వైస్ చైర్మన్ గిరియాదవ్, మున్సిపల్ చైర్మన్ రాంపాల్నాయక్, వైస్ చైర్మన్ దుర్గయ్య, జిల్లా విజిలెన్స్ కమిటీ అధ్యక్షుడు పత్యానాయక్, రైతు సమన్వయ సమితి మండలాధ్యక్షుడు నారాయణ పాల్గొన్నారు.
నేరాల అదుపునకు సీసీ కెమెరాలు కీలకం
కడ్తాల్ : శాంతిభద్రతలను కాపాడటంలో సీసీ కెమెరాలు కీలకపాత్రని పోషిస్తాయని ఎమ్మెల్యే జైపాల్యాదవ్ అన్నారు. శనివారం మండల పరిధిలోని మైసిగండి గ్రామంలో పోలీసులు, గ్రామ పంచాయతీ పాలక మండలి సభ్యుల సహకారంతో ఏర్పాటు చేసిన 28 సీసీ కెమెరాలను సర్పంచ్ తులసీరాంనాయక్, ఎస్ఐ హరిశంకర్గౌడ్తో కలిసి ఎమ్మెల్యే ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ సమాజంలో జరుగుతున్న అసాంఘిక కార్యకలాపాలను అరికట్టడంలో సీసీ కెమెరాలు దోహదపడతాయని తెలిపారు. గ్రామాల్లో ఏర్పాటు చేస్తున్న సీసీ కెమెరాలను మండల కేంద్రంలోని పోలీస్స్టేషన్కు అనుసంధానం చేయడం జరిగిందన్నారు. సీసీ కెమెరాలతో ఏర్పాటుతో గ్రామాలన్నీ పోలీసుల నిఘా నీడలో ఉంటాయని, ఏ చిన్న సంఘటన జరిగినా పోలీసులకు తెలుస్తున్నదన్నారు.
మైసిగండి మైసమ్మ ఆలయ అభివృద్ధికి ప్రత్యేక కృషి చేస్తున్నామని, రూ.కోటితో ఆలయ ప్రహరీ నిర్మాణ పనులు జరుగుతున్నాయని చెప్పారు. మైసిగండి గ్రామంలో మోడల్ గ్రామ పంచాయతీ భవనాన్ని నిర్మిస్తామని, గ్రామం నుంచి గాన్గుమార్లతండా మీదుగా అన్మాస్పల్లి గ్రామం వరకు, మైసిగండి నుంచి గోవిందాయిపల్లి, ఏక్వాయిపల్లి గ్రామాల మీదుగా మర్రిపల్లి గ్రామం వరకు బీటీ రోడ్ల నిర్మాణానికి ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపామని ఎమ్మెల్యే వివరించారు. అనంతరం పల్లెప్రగతి కార్యక్రమంలో భాగంగా పారిశుధ్య పనులు నిర్వహించిన కార్మికులను ఎమ్మెల్యే సన్మానించారు. కార్యక్రమంలో జడ్పీటీసీ దశరథ్నాయక్, ఏఎంసీ వైస్ చైర్మన్ గిరియాదవ్, ఉప సర్పంచ్ రాజారాం, ఎంపీడీవో రామకృష్ణ, ఏంపీవో మధుసూదనాచారి, హర్యానాయక్, పుష్ప, తులసీరాం, లక్ష్మి, శారద, ప్రేమ, లక్ష్మణ్, శంకర్ తదితరులు పాల్గొన్నారు.