యాచారం, జూన్ 18 : కేంద్రం ప్రవేశపెట్టిన అగ్నిపథ్ పథకాన్ని వెంటనే రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ ఎస్ఎఫ్ఐ నాయకులు శనివారం ర్యాలీ నిర్వహించారు. ప్రధాని డౌన్ డౌన్ అంటూ నినాదాలు చేశారు. సాగర్ రహదారిపై రాస్తారోకో చేసి నిరసన వ్యక్తం చేశారు.
ఈ సందర్భంగా ఎస్ఎఫ్ఐ మండల నాయకుడు శివ మాట్లాడుతూ.. దేశాన్ని పాలించడంలో పూర్తిగా విఫలమైన ప్రధాని వెంటనే గద్దె దిగాలన్నారు.