గ్రామాలు, పట్టణాల్లో నెలకొన్న సమస్యల పరిష్కారానికే ప్రభుత్వం పల్లె, పట్టణ ప్రగతి కార్యక్రమాలను నిర్వహిస్తున్నదని ప్రజాప్రతినిధులు, అధికారులు అన్నారు. మంగళవారంతో పల్లె ప్రగతి ఐదో రోజుకు చేరింది. ఇబ్రహీంపట్నం, ఆమనగల్లు, చేవెళ్ల, షాద్నగర్ నియోజకవర్గాల వ్యాప్తంగా వీధులను శుభ్రం చేశారు. కలుపు మొక్కలను తొలగించారు. వివిధ అభివృద్ధి కార్యక్రమాలకు శ్రీకారం చుట్టారు.
ఇబ్రహీంపట్నం, జూన్ 7 : విద్యుత్ ఏఈ శ్రీనివాస్రావుతో కలిసి చైర్పర్సన్ స్రవంతి పలు వార్డుల్లో పర్యటించారు. 23వ వార్డులో వేలాడుతున్న విద్యుత్ తీగలను పరిశీలించారు. విద్యుత్ తీగల మరమ్మతులు, శిథిలావస్థలో ఉన్న స్తంభాలను తొలగించి కొత్త వాటిని ఏర్పాటు చేయటం, ఇనుప స్తంభాలను తొలగించటం వంటి కార్యక్రమాలు చేపడుతామన్నారు.
షాద్నగర్రూరల్ :మండలంలోని కమ్మదనం గ్రామంలో సర్పంచ్ నర్సింహులు ఆధ్వర్యంలో నిర్వహించిన పల్లె ప్రగతిలో కలుపు మొక్కలను తొలగించారు. ఆదర్శ గ్రామంగా తీర్చిదిద్దుతామన్నారు. కార్యక్రమంలో వార్డు సభ్యులు, గ్రామ పంచాయతీ సిబ్బంది, గ్రామస్తులు పాల్గొన్నారు.
పట్టణ ప్రగతితో మరింత శుభ్రంగా
షాద్నగర్రూరల్ : పట్టణ ప్రగతి కార్యక్రమాలతో మున్సిపాలిటీ మరింత శుభ్రంగా మారుతున్నదని మున్సిపల్ చైర్మన్ నరేందర్ అన్నారు. షాద్నగర్ మున్సిపాలిటీలోని 7 వార్డులో గల ఆనంద్నగర్ కాలనీలో కౌన్సిలర్ ఈశ్వర్రాజు ఆధ్వర్యంలో నిర్వహించిన పట్టణ ప్రగతిలో మున్సిపల్ కమిషనర్ జయంత్కుమార్తో కలిసి ఆయన పాల్గొన్నారు. కాలనీలో చెత్తచెదారం, కలుపు మొక్కలను తొలగించారు.
పట్టణ ప్రగతితో సమస్యల పరిష్కారం
తుర్కయాంజాల్ : మున్సిపాలిటీ పరిధిలోని మునగనూ ర్ గ్రామం యాదాద్రినగర్ కాలనీలో పవర్ డే సందర్భంగా కౌన్సిలర్ స్వాతి జూనియర్ లైన్మన్ నవీన్తో కలిసి విద్యుత్ సమస్యలను తెలుసుకున్నారు. పేరుకుపోయిన చెత్త ను శుభ్రం చేయించారు. ప్రజలకు పట్టణ ప్రగతిపై అవగాహన కల్పించారు. కార్యక్రమంలో టీఆర్ఎస్ మున్సిపాలిటీ అధ్యక్షుడు అమరేందర్రెడ్డి, స్పెషల్ ఆఫీసర్ ప్రవీణ్ తదితరులు పాల్గొన్నారు. అదేవిధంగా మున్సిపాలిటీలోని పలు వార్డులో కమిషనర్ జ్యోతి పర్యటించారు.కౌన్సిలర్లు కంబాలపల్లి ధన్రాజ్, మంగమ్మ, రేవెల్లి హరిత, అనురాధ ఆయా వార్డుల్లో నిర్వహించిన పట్టణ ప్రగతిలో పాల్గొన్నారు.
తడిపొడి చెత్తపై అవగాహన
యాచారం : మండలంలోని తమ్మలోనిగూడ, తక్కళ్లపల్లి, కొత్తపల్లి గ్రామాల్లో ప్రజాప్రతినిధులు, అధికారులు పర్యటించారు. తమ్మలోనిగూడలో వైకుంఠధామాన్ని పరిశీలించి పెండింగ్లో ఉన్న పనులను పూర్తి చేయాలని సూచించారు. తక్కళ్లపల్లిలో ప్రభుత్వ పాఠశాలను సందర్శించారు. కొత్తపల్లిలో తడి చెత్త, పొడి చెత్తపై ప్రజలకు అవగాహన కల్పించారు. కార్యక్రమంలో ఎంపీపీ సుకన్య, జడ్పీటీసీ జంగమ్మ, ఎంపీడీవో విజయలక్ష్మి, ఎంపీవో ఉమారాణి, సర్పంచ్లు కాలె సంతోష, హబీబుద్దీన్, సంతోష, ఎంపీటీసీ సుమతమ్మ, పంచాయతీ కార్యదర్శులు ఉన్నారు.
జోరుగా పల్లె ప్రగతి
పెద్దఅంబర్పేట : గౌరెల్లిలో సర్పంచ్ తుడుము మల్లేశ్ గ్రామస్తులతో కలిసి పలు వీధుల్లో పరిశీలించారు. చెత్తా చెదారాన్ని తొలగించారు. అంతా కలిసి శ్రమదానం చేశా రు. మ్యాన్హోళ్లకు కొత్త స్లాబ్లు ఏర్పాటుచేశారు.
పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలి
కడ్తాల్: పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉన్నదని ఎంపీడీవో రామకృష్ణ అన్నారు. మండలంలోని కొండ్రిగానిబోడు తండాలో పర్యటించారు. వైకుంఠధామం, పల్లెప్రకృతి వనం, కంపోస్టు షెడ్డు, నర్సరీ, అంగన్వాడీ కేంద్రం, గ్రామీణ క్రీడా ప్రాంగణం, పాఠశాలను ఆయన పరిశీలించి, తడి, పొడి చెత్తపై ప్రజలకు అవగాహన కల్పించారు. కార్యక్రమంలో సర్పంచ్ సేవ్యాబావోజీ, ఉప సర్పంచ్ శ్రీను పాల్గొన్నారు.
గ్రామాల్లో కొనసాగుతున్న పల్లె ప్రగతి
కొందుర్గు : మండలంలోని విశ్వనాథ్పూర్ గ్రామాన్ని ఏపీవో నర్సింగరావు పరిశీలించారు. ప్రభుత్వ ఆదేశాల ప్రకారం గ్రామంలో పనులు జరుగాలన్నారు. కార్యక్రమంలో సర్పంచ్ శ్రీధర్రెడ్డి, కార్యదర్శి రమేశ్ పాల్గొన్నారు.
నర్సరీ, పల్లెప్రకృతి వనాల పరిశీలన
కొత్తూరు రూరల్ : కొడిచర్ల, పెంజర్ల, ఇన్ముల్నర్వ, ఆయా గ్రామాల్లో నిర్వహించిన పల్లెప్రగతి కార్యక్రమంలో ఎంపీడీవో శరత్చంద్రబాబు ఆయా గ్రామాల సర్పంచ్లు పాల్గొని అభివృద్ధి పనులను పరిశీలించారు. పల్లెప్రకృతి వనాన్ని, డంపింగ్ యార్డ్ను, నర్సరీలను పరిశీలించారు. కార్యక్రమంలో వార్డు సభ్యులు, మహిళా సంఘాల సభ్యులు, గ్రామస్తులు పాల్గొన్నారు.
అభివృద్ధి పనులను పరిశీలన
కేశంపేట : అభివృద్ధి పనులను మండల ప్రత్యేకాధికారి రఘుపతిరెడ్డి ఆధ్వర్యంలో అధికారులు పరిశీలించారు. కేశంపేట, తూర్పుగడ్డతండా, పాపిరెడ్డిగూడ గ్రామాల్లో పారిశుధ్యం, పల్లె ప్రకృతివనాలు, వననర్సరీలు, క్రీడా ప్రాంగణాలను పరిశీలించారు. మిగతా గ్రామాల్లో పల్లెప్రగతి కార్యక్రమాలను ప్రజాప్రతినిధులు నిర్వహించారు. కార్యక్రమంలో జడ్పీటీసీ విశాల, సర్పంచ్లు వెంకట్రెడ్డి, లలిత, విష్ణువర్ధన్రెడ్డి, ఇన్చార్జి ఎంపీడీవో రవిచంద్రకుమార్రెడ్డి, ఎంపీవో శ్రీనివాస్, కార్యదర్శులు పాల్గొన్నారు.
గ్రామాలను శుభ్రంగా ఉంచుకోవాలి
శంకర్పల్లి, జూన్ 7 : గ్రామాలను పరిశుభ్రంగా ఉంచుకోవాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందని ఎంపీడీవో వెంకయ్య అన్నారు. మంగళవారం పల్లెప్రగతిలో భాగంగా మండలంలోని చందిప్ప గ్రామంలో శ్రమదానం చేయించారు. కార్యక్రమంలో సర్పంచ్ స్వప్న, ఎంపీవో గీత పాల్గొన్నారు.
తలకొండపల్లి : తలకొండపల్లి, చుక్కాపూర్, చంద్రదన గ్రామాల్లో పల్లె ప్రగతిపనులను ఎంపీడీవో రాఘవులు పరిశీలించారు. వీధిలైట్ల ఏర్పా టు, పారిశుధ్య పనులు, మొక్కల సంరక్షణ వంటి పనులు పక్కగా చేపట్టాలన్నారు. వీధులను శుభ్రం చేయించారు.