కడ్తాల్, జూన్ 7: మండలంలోని ఏక్వాయిపల్లి గ్రామ సమీపంలోని అటవీ ప్రాంతంలో కొందరు గుర్తు తెలియని వ్యక్తులు తవ్వకాలు జరిపారన్న సమాచారం స్థానికంగా కలకలం సృష్టించింది. మండలంలోని ముద్విన్-ఏక్వాయిపల్లి గ్రామాల సమీపంలోని శంకరాయచెరువు దగ్గరి లోని అటవీ ప్రాంతంలో దుబ్బదోనగుట్ట వద్ద ఉన్న అటవీ ప్రాంతంలో కొందరు గుర్తు తెలియని వ్యక్తులు బోర్ డ్రిల్లింగ్తో గుట్టలను పగులగొట్టారని.. గుప్త నిధుల కోసమే ఆ తవ్వకాలను జరిపి ఉండొచ్చని స్థానికులు అనుమానిస్తున్నా రు. గతేడాది కూడా కొందరు వ్యక్తులు ఈ ప్రాంతంలో గుప్త నిధుల కోసం తవ్వకాలు జరిపినట్లు పలువురు పేర్కొంటున్నారు. కాగా తవ్వకాలు జరిపిన ప్రాంతాన్ని మంగళవారం పోలీసులు సందర్శించి వివరాలను సేకరించారు.