చేవెళ్ల రూరల్, నవంబర్ 9 : ప్రతి సమస్యను పరిషరించి, పల్లెల్లో వెలుగులు నింపేందుకు శుభోదయం కార్యక్రమానికి శ్రీకారం చుట్టిన్నట్లు జడ్పీ చైర్పర్సన్ అనితారెడ్డి చేవెళ్ల ఎమ్మెల్యే కాలె యాదయ్య అన్నారు. చేవెళ్ల మండలంలోని ఊరెళ్ల, దేవుని ఎర్రవల్లి గ్రామాల్లో వారు చేపట్టిన శుభోదయం కార్యక్రమంలో భాగంగా బుధవారం పర్యటించారు. ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యల గురించి ఆరా తీశారు. అనంతరం జడ్పీ చైర్పర్సన్ అనితారెడ్డి, ఎమ్మెల్యే కాలె యాదయ్య మాట్లాడుతూ.. గ్రామాల అభివృద్ధికి సీఎం కేసీఆర్ ప్రభుత్వం అధిక నిధులు మంజూరు చేస్తున్నదని తెలిపారు. మిషన్ భగీరథ తాగునీరు, రైతు బంధు, రైతు బీమా, దళిత బంధు తదితర పథకాలతో పేద ప్రజలను ఆదుకుంటున్నారని తెలిపారు. ఎకువగా కరెంట్ సమస్య ఉందని ప్రజల నుంచి వినతులు రావడంతో వెంటనే సమస్యను పరిషరించాలని విద్యుత్ అధికారులకు ఆదేశించారు.
దేవుని ఎర్రవల్లి గ్రామంలో జడ్పీ నిధులు రూ.8.5 లక్షలతో నిర్మించిన నూతన అంగన్వాడీ భవనాన్ని జడ్పీ చైర్పర్సన్ అనితారెడ్డి, ఎమ్మెల్యే కాలె యాదయ్య ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ విజయలక్ష్మి రమణారెడ్డి, జడ్పీటీసీ మాలతి, డీసీఎంఎస్ చైర్మన్ కృష్ణారెడ్డి, వైస్ ఎంపీపీ ప్రసాద్, శివారెడ్డి, మార్కెట్ కమిటీ చైర్మన్ మిట్ట వెంకట రంగారెడ్డి, సర్పంచ్లు సామ మాణిక్యరెడ్డి, జహంగీర్, టీఆర్ఎస్ మండలాధ్యక్షుడు ప్రభాకర్, సివిల్ సైప్లె జిల్లా డైరెక్టర్ రవీందర్, రైతు బంధు సమితి కౌకుంట్ల అధ్యక్షుడు నాగార్జునరెడ్డి, టీఆర్ఎస్ బీసీ సెల్ మండల అధ్యక్షుడు ఎదిరె రాములు, ఎంపీడీవో రాజ్కుమార్, మిషన్ భగీరథ ఏఈ, ఏఈ, ఏడీ, ఎంపీటీసీ రవీందర్రెడ్డి పాల్గొన్నారు.