పరిగి, ఆగస్టు 3: బీసీల అభ్యున్నతికి ప్రభుత్వం కృషి చేస్తున్నదని పరిగి ఎమ్మెల్యే కొప్పుల మహేశ్రెడ్డి తెలిపారు. బుధవారం పరిగి పట్టణంలోని ఐదో వార్డు మందుల కాలనీలో బీసీ కమ్యూనిటీ హాల్ నిర్మాణానికి ఎమ్మెల్యే భూమి పూజ చేసి పనులు ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అన్ని వర్గాల సంక్షేమమే ధ్యేయంగా ప్రభుత్వం పనిచేస్తున్నదన్నారు. బీసీ కమ్యూనిటీహాల్ నిర్మాణంతో అనేక మందికి ఉపయో గకరంగా ఉంటుందన్నారు. టీఆర్ఎస్ ప్రభుత్వం హయాంలో అన్ని వర్గాలకు సమన్యాయం జరు గుతున్నదన్నారు. అన్ని కులాల ఆత్మగౌరవ భవనాల నిర్మాణానికి సర్కారు భూమి కేటా యించినట్లు ఆయన గుర్తు చేశారు. పరిగి పట్టణాన్ని అన్ని విధాలుగా అభివృద్ది చేసేందుకు కృషి చేస్తామన్నారు. కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ ముకుంద అశోక్, ఎంపీపీ అరవిం దరావు, మార్కెట్ కమిటీ చైర్మన్ సురేందర్, మాజీ ఎంపీపీ కల్లు శ్రీనివాస్రెడ్డి, నాయ కుడు బి.ప్రవీణ్కుమార్రెడ్డి, పీఏసీఎస్ వైస్ చైర్మన్ ఎస్.భాస్కర్, కౌన్సిలర్లు పాల్గొన్నారు.
ప్రమాదకరంగా పారే వాగులను దాటొద్దు
పూడూరు, ఆగస్టు 3: ప్రమాదకరంగా పారే వాగులను దాటొద్దని ఎమ్మెల్యే మహేశ్రెడ్డి సూచించారు. బుధవారం పూడూరు మండలం మంచన్పల్లి గ్రామ సమీపంలో ఉన్న ఈసీ వాగుపై ఉన్న వంతెనను పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ భారీ వర్షాల వల్ల గుంతలు పడ్డ రోడ్ల మరమ్మతులు చేయిస్తామన్నారు. అనంతరం గట్టుపల్లి గ్రామంలో మొక్కలను నాటారు. కార్యక్రమంలో జడ్పీటీసీ మేఘమాల, పరిగి మార్కెట్ కమిటీ చైర్మన్ సురేందర్, ఆయా గ్రామాల సర్పంచ్లు ఆంజనేయులు, యశోద, రాంరెడ్డి, వార్డు సభ్యులు, నాయకులు, కార్యకర్తలు ఉన్నారు.