చేవెళ్ల రూరల్, జూలై 21 : టీఆర్ఎస్ కార్యకర్తల కుటుంబాలకు పార్టీ ప్రమాద బీమాతో భరోసా కల్పిస్తున్నదని ఎమ్మెల్యే కాలె యాదయ్య అన్నారు. చేవెళ్ల మండల పరిధిలోని కమ్మెట గ్రామానికి చెందిన బ్యాగరి దశరథ ఇటీవల ప్రమాదవశాత్తు మరణించాడు. అతడికి టీఆర్ఎస్ సభ్యత్వం ఉంది. దీంతో గురువారం ఎమ్మెల్యే కాలె యాదయ్య కమ్మెట గ్రామానికి వెళ్లి బేగరి దశరథ భార్య వసంతకు టీఆర్ఎస్ ప్రమాద బీమాకు సంబంధించిన రూ.2 లక్షల చెక్కును అందజేశారు. అనంతరం ఎమ్మెల్యే కాలె యాదయ్య మాట్లాడుతూ.. సీఎం కేసీఆర్ టీఆర్ఎస్ కార్యకర్తల కుటుంబాలకు భరోసాను కల్పిస్తున్నారన్నారు. అన్ని వర్గాల సంక్షేమం టీఆర్ఎస్ ప్రభుత్వంతోనే సాధ్యమన్నారు. ఎమ్మెల్యే వెంట డీసీఎంఎస్ చైర్మన్ పట్లొళ్ల కృష్ణారెడ్డి, చేవెళ్ల మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ శ్రీధర్రెడ్డి, టీఆర్ఎస్ మండలాధ్యక్షుడు ప్రభాకర్, టీఆర్ఎస్ మండల ప్రధాన కార్యదర్శి హన్మంత్రెడ్డి, టీఆర్ఎస్ మండల యూత్ అధ్యక్షుడు తోట శేఖర్, టీఆర్ఎస్ సీనియర్ నాయకులు మిట్ట వెంకట రంగారెడ్డి, రమణారెడ్డి, మర్పల్లి కృష్ణారెడ్డి, మాధవ్ గౌడ్, కమ్మెట సర్పంచ్ తులసిరాజు, టీఆర్ఎస్ నాయకులు, గ్రామస్తులు పాల్గొన్నారు.
పండుగలను ప్రశాంతంగా జరుపుకోవాలి
శంకర్పల్లి, జూలై 21 : బోనాల పండుగలను ప్రశాంతంగా జరుపుకోవాలని ఎమ్మెల్యే యాదయ్య అన్నారు. గురువారం శంకర్పల్లి మండలంలోని ఎల్వర్తి, కోజ్జగూడ, టంగటూర్ గ్రామాల్లో జరిగిన బోనాల ఉత్సవాల్లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ముఖ్యమంత్రి కేసీఆర్ అన్ని మతాలకు తగిన ప్రాధాన్యం కల్పిస్తున్నారన్నారు. కార్యక్రమంలో సర్పంచులు రవీందర్గౌడ్, సత్యనారాయణ, శ్రీనివాస్, టీఆర్ఎస్ మండల అధ్యక్షుడు గోపాల్, మున్సిపల్ అధ్యక్షుడు వాసుదేవ్ కన్నా, టీఆర్ఎస్ నాయకులు ప్రవీణ్కుమార్, గోపాల్రెడ్డి పాల్గొన్నారు.