సంచార పశువైద్యశాలలు సత్ఫలితాలిస్తున్నాయి. వికారాబాద్ జిల్లాలో కొడంగల్, పరిగి, తాండూరు, వికారాబాద్లలో ఏర్పాటు చేసిన సంచార పశువైద్యశాలలు 2017 సెప్టెంబర్ 17 నుంచి సేవలందిస్తున్నాయి. జిల్లాలో 96 పశువైద్య కేంద్రాలు ఉన్నప్పటికీ అత్యవసర సమయాల్లో 1962 నంబర్కు ఫోన్ చేస్తే పల్లెకు వెళ్లి పశువులు, జీవాలకు చికిత్సలు చేస్తున్నారు. ఇప్పటి వరకు జిల్లాలో 57037 పర్యాయాలు ఆయా గ్రామాలకు వెళ్లి 1,02,034 పశువులు, జీవాలకు చికిత్సలు చేశారు. ఒక్కో వాహనంలో డాక్టర్, పారావెట్, డ్రైవర్, సహాయకుడితో పాటు అవసరమైన అన్ని మందులు వాహనంలోనే ఉంటాయి. పశుసంపదను పెంచేందుకు ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలపై రైతులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.
పరిగి, జూలై 17: పశువులు, జీవాలకు అత్యవసర వైద్యం అందించేందుకు ప్రభుత్వం అందుబాటులోకి తీసుకొచ్చిన సంచార పశువైద్యశాలలు సత్ఫలితాలను ఇస్తున్నాయి. ప్రతి మండలంలో పశువైద్యకేంద్రాలు, ఉప కేంద్రాలు ఉన్నప్పటికీ… అత్య వసర సమయాల్లో 1962 నంబర్కు ఫోన్ చేస్తే పల్లె లకెళ్లి పశువులు, జీవాలకు చికిత్సలు చేస్తున్నారు. 2017 సెప్టెంబర్ 17వ తేదీ నుంచి వికారాబాద్ జిల్లాలో ఈసేవలు అందుబాటులోకి రాగా.. 2022 జూన్ నెలాఖరు వరకు జిల్లాలో నాలుగు సంచార పశువైద్యశాలల బృందాలు 57,037 పర్యాయాలు గ్రామాలకెళ్లి 1,02,034 పశువులు, జీవాలకు చికిత్సలు అందించాయి. జిల్లాలో 96 పశువైద్య కేంద్రాలున్నాయి. కాగా తెల్లజాతి పశువు లు 1,77,498, నల్లజాతి పశువులు 81,817, గొ ర్రెలు, 2,45,863, మేకలు 2,58120 ఉన్నాయి.
జిల్లా పరిధిలో ఇప్పటివరకు 1,02,034 పశువులకు సంచార పశువైద్యశాలల బృందాలు చికిత్సను అందించాయి. కొడంగల్, పరిగి, తాండూరు, వికారాబాద్ నియోజకవర్గ కేంద్రాల్లో సంచార పశువైద్యశాలల వాహనాలు ఉండగా.. ఇక్కడి నుంచే ఆయా నియోజకవర్గాల్లోని గ్రామాల్లోని పశువులు, ఇతర జీవాలకు 1962 నంబర్కు ఫోన్ చేసిన గ్రామాలకెళ్లి ఆ బృందాల సభ్యులు చికిత్సలు అంది స్తున్నారు. 2017లో సంచార పశు వైద్య బృందాలు ప్రారం భం కాగా.. నాలుగు వాహనాలు 1,256 పర్యాయాలు జిల్లాలోని గ్రామాలకెళ్లి 6,822 పశువులకు, 2018లో 10,088 పర్యాయాలు 24,433 పశువులకు, 2019లో 15,446 పర్యాయాల్లో 27,575 పశువులకు, 2020లో 11,996 పర్యాయాల్లో 17,215 పశువులకు, 2021లో 12405 పర్యాయాల్లో 17,778 పశువులకు, 2022లో జూన్ నెలాఖరు వరకు 5,846 పర్యాయాలు వెళ్లి 8,211 పశువులకు చికిత్సలు అందించాయి. ఒక్కో వాహనంలో పశువైద్యాధికారి, ఒక కెప్టెన్(డ్రైవర్), పారావెట్, సహాయకుడు ఉంటారు. ప్రతిరోజూ ఉదయం 7 గంటల నుంచి వారు అందుబాటులో ఉండి అప్పటివరకు 1962 నంబర్కు వచ్చిన ఫోన్ కాల్స్ ఆధారంగా ఆయా గ్రామాలకెళ్లి పశువులకు అత్యవసర చికిత్సను అందిస్తారు. సంచార పశువైద్యశాలల్లో అవసరమైన మందులు కూడా అందుబాటులో ఉంటాయి. సాధారణంగా పశువులకు ఏదైనా సమస్య ఉంటే సమీపంలోని పశువైద్య కేంద్రానికి తీసుకెళ్లి చికిత్సలు చేయించడం జరుగుతుంది. కానీ.. పశువైద్య కేంద్రానికి వెళ్లలేని పరిస్థితుల్లో ఉన్నటువంటి పశువులకు సంచార పశువైద్యశాలల ద్వారా చక్కటి సేవలు అందుతున్నాయి. పశు సంపద పెంచేందుకు ప్రభుత్వం తీసుకుంటు న్న చర్యలపై రైతులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.