ఇబ్రహీంపట్నం, జూలై 17 : వర్షాలకు దెబ్బతిన్న రోడ్లను యుద్ధ ప్రాతిపదికన మరమ్మతులను చేయిస్తామని ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్రెడ్డి అన్నారు. ఇబ్రహీంపట్నం మున్సిపాలిటీలో ఆదివారం ఆయన పర్యటించారు. 8వ వార్డులో సీసీరోడ్డు నిర్మాణం పనులకు శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ మున్సిపాలిటీ పరిధిలో మిషన్భగీరథ పైపులైన్ల ఏర్పాటు కోసం తవ్విన రోడ్లకు కూడా మరమ్మతులు చేస్తున్నామన్నారు. సుమారు రూ.16 కోట్లతో మున్సిపాలిటీ పరిధిలోని దెబ్బతిన్న రోడ్ల స్థానంలో కొత్తరోడ్లను వేయనున్నట్లు తెలిపారు. ఇప్పటికే ఐసీడీఎస్ కార్యాలయం నుంచి ఇబ్రహీంపట్నం పాత పోలీస్ స్టేషన్ వరకు పూర్తిస్థాయిలో సీసీరోడ్డును వేయించామన్నారు. త్వరలోనే ఈశ్వరాంజనేయస్వామి ఆలయం నుంచి లైబ్రరీ వరకు, పాత బస్టాండ్ నుంచి కల్లుకంపౌండు వరకు, బస్టాండు ముందు సాగర్రోడ్డు నుంచి అంకింత దవాఖాన మీదుగా బ్రిలియంట్ స్కూల్ వరకు సీసీరోడ్లు వేయనున్నట్లు తెలిపారు. ఈ పనులు వెంటనే పూర్తిచేయాలని ఆయన అధికారులను ఆదేశించారు. ఆదిబట్ల, తుర్కయంజాల్, పెద్దఅంబర్పేట్ మున్సిపాలిటీల్లో కూడా మిషన్భగీరథ పైపులైన్ల ఏర్పాటు వల్ల దెబ్బతిన్న రోడ్లను సీసీ రోడ్లుగా మారుస్తామన్నారు. కార్యక్రమంలో మున్సిపల్ చైర్పర్సన్ కప్పరి స్రవంతి, వైస్ చైర్మన్ ఆకుల యాదగిరి, కౌన్సిలర్లు ఇందిరాల రమేశ్, నల్లబోలు మమత, నీలం శ్వేత, సుజాత, పద్మ, టీఆర్ఎస్ నాయకులు వేణుగోపాల్, రవీందర్, సురేశ్, జెర్కోని రాజు, బుగ్గరాములు, నిట్టు జగదీశ్, మైలారం విజయ్కుమార్, శివారిరెడ్డి పాల్గొన్నారు.
పేదల సంక్షేమమే ప్రభుత్వ ధ్యేయం
యాచారం : పేద ప్రజల సంక్షేమమే రాష్ట్ర ప్రభుత్వ ధ్యేయమని ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్రెడ్డి అన్నారు. మండలంలోని మేడిపల్లి గ్రామానికి చెందిన వడ్డెమోని ఇంద్రమ్మకు రూ.60 వేల సీఎంఆర్ఎఫ్ చెక్కు మంజూరైంది. ఆ చెక్కును ఆదివారం క్యాంపు కార్యాలయంలో బాధితురాలికి ఎమ్మెల్యే అందజేశారు. నియోజకవర్గంలో వందల కుటుంబాలు సీఎం రిలీఫ్ఫండ్తో లబ్ధి పొందాయన్నారు. నియోజకవర్గ అభివృద్ధి కోసం నిరంతరం కృషి చేస్తున్నట్లు ఆయన తెలిపారు. కార్యక్రమంలో టీఆర్ఎస్ మండల అధ్యక్షుడు కర్నాటి రమేశ్గౌడ్, ప్రధాన కార్యదర్శి భాష, సర్పంచ్ శ్రీనివాస్రెడ్డి, టీఆర్ఎస్ నాయకులు వడ్డెమోని కిషన్, మొరుగు రమేశ్, బోడ కృష్ణ, కలకొండ శ్రీశైలం, ఆలంపల్లి కృష్ణ, మక్కపల్లి శ్రీను, మక్కపల్లి మధు, దెంది సురేందర్, ఉడుతల ప్రవీణ్, కృష్ణ తదితరులున్నారు.