పరిగి, జూలై 9: రుతుపవనాలకు తోడు ఉపరితల ఆవర్తన ప్రభావంతో వికారాబాద్ జిల్లాలో శుక్రవారం రాత్రి నుంచి శనివారం వరకు మోస్తరు నుంచి భారీ వర్షం కురిసింది. దీంతో పలుచోట్ల వా గులు వరద నీటితో ప్రవహించాయి. కొన్ని చెరువు లు, కుంటలు నీటితో నిండాయి. ఇప్పటికే జిల్లాలో కురుస్తున్న వర్షాలతో రైతులు పంటల సాగు కోసం విత్తనాలను వేసే పనుల్లో నిమగ్నమయ్యారు.
జిల్లాలో ఎడతెరిపి లేని వర్షానికి పెద్దేముల్లో అత్యధికంగా 5.4 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. మర్పల్లిలో 30.0 మిల్లీమీటర్లు, మోమిన్పేటలో 33.0 మి.మీ, నవాబుపేటలో 31.2 మి.మీ, వికారాబాద్లో 48.2 మి.మీ, పూడూరులో 41.2 మి. మీ, పరిగిలో 23.2 మి.మీ, కులకచర్లలో 32.0 మి.మీ, దోమలో 44.8 మి.మీ, బంట్వారంలో 43.2 మి.మీ, బొంరాస్పేటలో 33.2 మి.మీ, తాండూరులో 47.8 మి.మీ, బషీరాబాద్లో 38.6 మి.మీ, యాలాలలో 41.0 మి.మీ, కొడంగల్లో 31.6 మి.మీ, దౌల్తాబాద్లో 35.2 మిలీమీటర్ల వర్షం కురువగా… జిల్లాలో సరాసరి వర్షాపాతం 37.5 మిల్లీమీటర్లుగా నమోదైంది.