రంగారెడ్డి, జూలై 9 (నమస్తే తెలంగాణ): జిల్లా అంతటా ఎడతెరిపి లేకుండా వర్షం కురుస్తున్నది. రెండు రోజులుగా జిల్లాలోని అన్ని మండలాల్లో మోస్తరు నుంచి భారీ వర్షం కురిసింది. శుక్రవారం రాత్రి నుంచి శనివారం ఉదయం వరకు జిల్లాలో 29.6 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది. మూసీనదికి వరద నీరొచ్చింది. అదేవిధంగా జిల్లాలోని ప లు మండలాల్లోని చెరువులు నిండుకుండలా మా రాయి. అబ్దుల్లాపూర్మెట్ మండలంలోని తట్టిఅన్నారంలో అత్యధికంగా 5.02 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. మరోవైపు ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షంతో జిల్లా అధికారులు అప్రమత్తమయ్యారు. శిథిలావస్థకు చేరిన ఇండ్లల్లో ఉన్న ప్రజలను సురక్షిత ప్రాంతాలకు వెళ్లాలని సూచిస్తున్నారు. అల్పపీడన ప్రభావంతో మరో రెండు రోజులపాటు భారీ వర్షాలు కురిసే అవకాశాలున్నాయని వాతావరణ శాఖ హెచ్చరిస్తున్న దృష్ట్యా జిల్లా ఉన్నతాధికారులు యంత్రాంగాన్ని అప్రమత్తం చేశారు.
రంగారెడ్డి జిల్లాలోని 24 మండలాల్లో వర్షపాతం సాధారణానికి మంచి నమోదుకాగా.. మరో మూడు మండలాల్లో సాధారణ వర్షపాతం నమోదైంది. హయత్నగర్ మండలంలో అత్యధికంగా 45 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదు కాగా.. ఇబ్రహీంపట్నం లో 42 మి.మీ, అబ్దుల్లాపూర్మెట్లో 40 మి.మీ, సరూర్నగర్లో 39 మి.మీ, రాజేంద్రనగర్లో 36 మి.మీ, యాచారంలో 37 మి.మీ, మహేశ్వరంలో 33 మి.మీ, మొయినాబాద్లో 32 మి.మీ, శంషాబాద్లో 30 మి.మీ, కందుకూరు, ఆమనగల్లు మం డలాల్లో 29 మి.మీ, బాలాపూర్లో 28 మి.మీ, చేవెళ్లలో 26 మి.మీ, తలకొండపల్లిలో 25 మి.మీ, కేశంపేటలో 22 మి.మీ, నందిగామ మండలంలో 24 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది. అదేవిధం గా అబ్దుల్లాపూర్మెట్ మండలంలోని తట్టిఅన్నారంలో జిల్లాలోనే అత్యధికంగా 5.02 సెంటీమీటర్ల వర్షపాతం నమోదు కాగా ఇబ్రహీంపట్నం మండలంలోని ఇబ్రహీంపట్నంలో 4.8 సెం.మీ, మంగల్పల్లి, అబ్దుల్లాపూర్మెట్లలో 4.7 సెం.మీ, యాచా రం మండలంలోని నల్లవెల్లిలో 4.3సెం.మీ, హయత్నగర్లో 4.3 సెం.మీ, యాచారం మండలంలోని గున్గల్లో 4.2 సెం.మీ, అబ్దుల్లాపూర్మెట్ మండలంలోని పసుమాములలో 4.1 సెం.మీ, మంచాల మండలంలోని అరుట్లలో 3.5 సెం.మీ, కందుకూరు మండలంలోని మీర్ఖాన్పేట్లో 3.4 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది.