ఇబ్రహీంపట్నం, జులై 9 : ముఖ్యమంత్రి సహాయనిధి పథకం ఎంతోమంది నిరుపేద కుటుంబాలకు అండగా నిలుస్తున్నదని, సంక్షేమ పథకాలను అర్హులు సద్వినియోగం చేసుకోవాలని ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్రెడ్డి అన్నారు. పెద్దఅంబర్పేట్ మున్సిపాలిటీ పరిధిలోని కుంట్లూరుకు చెందిన నక్క సుభద్ర, పెద్దఅంబర్పేట్కు చెందిన చింతమడుగుల నిర్మలకు లక్ష రూపాయల చొప్పున మంజూరైన ఎల్వోసీలను శనివారం క్యాంపు కార్యాలయంలో అందజేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ సంక్షేమ పథకాలను అర్హులకు అందేలా కార్యకర్తలు కృషి చేయాలన్నారు. కార్యక్రమంలో టీఆర్ఎస్ మున్సిపల్ అధ్యక్షుడు సిద్దంకి కృష్ణారెడ్డి, కౌన్సిలర్ హరిశంకర్, నాయకులు ప్రభాకర్రెడ్డి, బలరాం, వెంకటేశ్వర్రెడ్డి, దామోదర్, రాము తదితరులు పాల్గొన్నారు.
ప్రభుత్వం ప్రవేశపెట్టిన దళితబంధు పథకం దేశానికే ఆదర్శంగా నిలుస్తున్నదని ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్రెడ్డి అన్నారు. అబ్దుల్లాపూర్మెట్ మండలంలోని బాటసింగారం గ్రామానికి చెందిన బొంతుల రాజు అనే వ్యక్తికి దళితబంధు కింద మంజూరైన కారును క్యాంపు కార్యాలయం ఆవరణలో అందజేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ..ఈ పథకం ఎంతోమంది నిరుపేద దళితులకు అండగా నిలుస్తుందని తెలిపారు. కార్యక్రమంలో టీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.