పరిగి, జూన్ 29 : ప్రభుత్వం చేపడుతున్న అభివృద్ధిని చూసి ఇతర పార్టీల నుంచి టీఆర్ఎస్లోకి వస్తున్నారని పరిగి ఎమ్మెల్యే కొప్పుల మహేశ్రెడ్డి పేర్కొన్నారు. బుధవారం పరిగిలోని ఎమ్మెల్యే నివాసంలో ఎమ్మెల్యే మహేశ్రెడ్డి సమక్షంలో దోమ మండలం పోతిరెడ్డిపల్లి సర్పంచ్ లక్ష్మి, కాంగ్రెస్ నాయకుడు వి.నారాయణ, ఉప సర్పంచ్ కె.గోవర్ధన్, వార్డుసభ్యులు వి.బాబు, బిచ్చయ్య, వీఎస్ఎస్ చైర్మన్ చంద్రా నాయక్, నాయకులు రవి, రమేశ్లతోపాటు 20 మంది కాంగ్రెస్ నుంచి టీఆర్ఎస్ పార్టీలో చేరారు. వారికి ఎమ్మెల్యే పార్టీ కండువాలు కలిపి టీఆర్ఎస్లోకి ఆహ్వానిం చారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ టీఆర్ఎస్ ఆధ్వర్యంలోనే పల్లెలు అభివృద్ధి చెందుతున్నాయని నమ్మకంతోనే ఇతర పార్టీల వారు టీఆర్ఎస్లో చేరుతున్నారని పేర్కొన్నారు. అనంతరం దోమ పాల ఉత్పత్తిదారుల సహకార సం ఘం చైర్మన్గా ఎన్నికైన శ్రీనివాస్ను ఎమ్మెల్యే అభినందించారు. ఈ కార్యక్రమాల్లో జడ్పీటీసీ కొప్పుల నాగారెడ్డి, వైస్ ఎంపీపీ మల్లేశం, దోమ సర్పంచ్ రాజిరెడ్డి, రైతు బంధు సమితి మండల అధ్యక్షుడు బి.లక్ష్మయ్య, సీనియర్ నాయకులు రాఘవేందర్రెడ్డి, పీఏసీఎస్ చైర్మన్ ప్రభాకర్రెడ్డి, టీఆర్ఎస్ మండల అధ్యక్షుడు గోపాల్, నాయకులు కృష్ణారెడ్డి తదితరులు పాల్గొన్నారు.
ప్రభుత్వం పేదల వైద్యానికి సీఎంఆర్ఎఫ్ ద్వారా తోడ్పాటు అందిస్తున్నదని ఎమ్మెల్యే మహేశ్రెడ్డి పేర్కొన్నారు. బుధవారం పరిగిలో రూ.24.26లక్షలు విలువ చేసే సీఎంఆర్ఎఫ్ ద్వారా మంజూరైన వారికి చెక్కులు, చికిత్స కోసం పలువురికి ఎల్వోసీలు ఎమ్మెల్యే మహేశ్రెడ్డి అందజేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మా ట్లా డుతూ పేద కుటుంబాలకు సర్కారు పలు రకాలుగా అండగా నిలుస్తుందన్నారు. ప్రతి సంవత్సరం వేలాది మంది పేదలకు సీఎంఆర్ఎఫ్ ద్వారా సహాయం అందు తుందని చెప్పారు. ఓవైపు సర్కారు దవాఖానలు బలోపేతం చేస్తుండడంతోపాటు కార్పొరేట్ దవాఖానలలో చికిత్స పొందిన వారికి సహాయం అందిస్తుందన్నారు. కార్యక్రమంలో ఎంపీపీ కె.అరవిందరావు, మార్కెట్ కమిటీ చైర్మన్ ఎ.సురేందర్, మున్సిపల్ చైర్మన్ ముకుంద అశోక్, పీఏసీఎస్ చైర్మన్ కొప్పుల శ్యాంసుందర్రెడ్డి, మండల టీఆర్ఎస్ అధ్యక్షుడు ఆర్.ఆంజనేయులు, సీనియర్ నాయకులు బి. ప్రవీణ్కుమార్రెడ్డి, పిఎసిఎస్ వైస్ చైర్మన్ భాస్కర్ తదితరులు పాల్గొన్నారు.