ఇబ్రహీంపట్నం, జనవరి 3 : రంగారెడ్డిజిల్లా నూతన కలెక్టర్గా శశాంక (2013 బ్యాచ్ ఐఏఎస్)ను ప్రభుత్వం నియమించింది. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి బుధవారం ఉత్తర్వులు జారీచేశారు. మహబూబాబాద్జిల్లా కలెక్టర్గా పనిచేస్తున్న శశాంకను రంగారెడ్డికి బదిలీ చేశారు. గత నెలరోజుల్లో ముగ్గురు కలెక్టర్లు బదిలీ అయ్యారు.
ఎన్నికలకు ముందు జిల్లా కలెక్టర్ హరీశ్ను ఎన్నికల కమిషన్ సూచనల మేరకు బదిలీ చేసి.. ఆయన స్థానంలో భారతిహోళికేరీని ప్రభుత్వం నియమించింది. ఆమెను కూడా బదిలీ చేయగా.. మేడ్చల్ కలెక్టర్గా ఉన్న గౌతమ్పోట్రును పదిరోజుల క్రితం ఇన్చార్జి కలెక్టర్గా ప్రభుత్వం నియమించింది. తాజాగా రంగారెడ్డి జిల్లా పూర్తిస్థాయి కలెక్టర్గా శశాంకను ప్రభుత్వం నియమించింది.