ఇబ్రహీంపట్నం, డిసెంబర్ 3: దివ్యాంగులు ఆత్మైస్థెర్యంతో ముందుకు సాగి అన్ని రంగాల్లో రాణించాలని రంగారెడ్డి జిల్లా అదనపు కలెక్టర్ తిరుపతిరావు అన్నారు. రంగారెడ్డి కలెక్టరేట్లోని సమావేశ మందిరంలో శనివారం అంతర్జాతీయ దివ్యాంగుల దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి తిరుపతిరావు ముఖ్యఅతిథిగా హా జరై మాట్లాడుతూ దివ్యాంగుల సంక్షేమానికి రాష్ట్ర ప్రభుత్వం అమలుచేస్తున్న పథకాలు, సేవలను సద్వినియోగం చేసుకుని, అన్నిరంగాల్లో ఆత్మవిశ్వాసంతో ముందుండాలన్నారు.
విద్యారంగంతోపాటు క్రీడలు, ఉద్యోగాలు, వ్యాపారా లు, ఇలా ఏ రంగంలో చూసినా దివ్యాంగులు సామాన్యులకు ఏమాత్రం తీసిపోకుండా తమ నైపుణ్యాన్ని చాటుతు న్నారని పేర్కొన్నారు. శారీరక లోపం విజ య సాధనకు ఏ మాత్రం అడ్డంకి కాదని, ఆత్మవిశ్వాసంతో ముందుకెళ్లి, అనుకున్న లక్ష్యాలను సాధించాలని సూచించారు. జిల్లాలో దివ్యాంగులకు సదరం సర్టిఫికెట్లు, పింఛన్తోపాటు సహాయ పరికరాలను అందిస్తున్నట్లు ఆయన తెలిపారు. దివ్యాంగుల సంఘాలకు బ్యాం కుల ద్వారా స్త్రీనిధి ద్వారా రుణా లు అందిస్తున్న ట్లు వివరించారు. అనంతరం ఈజీఎస్, సెర్ప్, మెప్మా కార్యక్రమాల అమల్లో ప్రతిభ చూపిన వారి కి ఆయన ప్రశంసాపత్రాలను అందజేశారు. కార్యక్రమంలో డీఆర్డీఏ ప్రభాకర్, జిల్లా రెవెన్యూ అధికారి హరిప్రియ, అదనపు డీఆర్డీఏ నీరజతోపాటు అధికారులు పాల్గొన్నారు.