కొందుర్గు : హైదరాబాద్లో ఆదివారం నిర్వహించిన నేషనల్ లేవల్ ఆల్స్టెల్ కరాటే కుంగ్ పూ ఛాంపియన్ షిప్ టోర్నమెంట్లో కొందుర్గు కరాటే విద్యార్థులు ప్రతిభ కనబరిచారు. అండర్ 14 విభాగంలో కరుణాకర్ గోల్డ్ మెడల్ సాధించగా అండర్ 19 సీనియర్ విభాగంలో కార్తిక్ గోల్డ్ మెడల్ సాదించాడు. ప్రతిభ కనబరిచిన విద్యార్థులకు గోల్డ్ మెడల్తో పాటు ప్రశంసా పత్రాలను అందజేసినట్లు మాస్టర్ రమేశ్ తెలిపారు. ఈ సందర్భంగా విద్యార్థులను వైస్ ఎంపీపీ రాజేష్పటేల్, గ్రామస్తులు అభినందించారు.