మర్పల్లి : ఆర్ఎంపీ డాక్టర్ వైద్యం వికటించి ఓ మహిళ మృతి చెందిన సంఘటన మర్పల్లి మండల కేంద్రంలో మంగళవారం రాత్రి జరిగింది. కుటుంబ సబ్యులు తెలిపిన వివరాల ప్రకారం.. మండలంలోని కోటమర్పల్లి గ్రామానికి చెందిన అస్మాబేగం (26) మంగళవారం మధ్యాహ్నం కడుపు నొప్పి రావడంతో మండల కేంద్రంలోని సాయిరామ్ క్లినిక్కు తీసుకురాగా అక్కడి ఆర్ఎంపీ డాక్టర్ శ్రీనివాస్ మూడు గంటల పాటు చికిత్స నిర్వహించాడు. తరువాత వేరే దవాఖానకు వెళ్లాలని తెలపడంతో స్థానిక ప్రభుత్వ దవాఖానకు తీసుకెళ్లారు. అక్కడి డాక్టర్లు పరీక్షలు నిర్వహించగా పరిస్థితి విషమించిందని సంగారెడ్డి దవాఖానకు తీసుకెళ్లాలని తెలపడంతో సంగారెడ్డి దవాఖానకు తరలిస్తుండగా మృతి చెందిందని అస్మా భర్త ఎండీ. అనీఫ్ తెలిపారు.
దీంతో కుటుంబ సభ్యులు ఆర్ఎంపీ డాక్టర్ వైద్యం వికటించడం వళ్లే అస్మా మృతి చెందిందని మృతదేహంతో సాయిరామ్ క్లినిక్ ముందు ఆందోళన చేపట్టారు. అస్మా బేగం మృతిపై పోలీసులను అడుగగా తమకు ఎలాంటి ఫిర్యాదు రాలేదని తెలిపారు.