వికారాబాద్లో ఎమ్మెల్యే మెతుకు ఆనంద్
బంట్వారం, జూన్ 14 : గ్రామాల్లో నెల కొన్న సమస్యలను సత్వరమే పరిష్కరిస్తామని ఎమ్మెల్యే ఆనంద్ పేర్కొన్నారు. మంగళవారం మండల పరిధిలోని యాచారం, నూరుళ్లపూర్ గ్రామాల్లో పర్యటించి సమస్యలు తెలుసుకున్నారు. అనంతరం యాచారం గ్రామం లో ఏర్పాటు చేసిన సమావేశంలో మండల సర్వేయర్ సక్రమంగా విధులు నిర్వహించడం లేదని గ్రామస్తులు ఎమ్మెల్యేకు చెప్పారు. భూమి సర్వే చేసేందుకు ఆన్లైన్ దరఖాస్తు చేసుకొని యేడాది గడుస్తున్నా భూమి సర్వే చేయడం లేదన్నారు. నిర్ణీత గడువు లోగా సర్వే చేయకపోగా, తిరిగి ఆన్లైన్ దరఖాస్తు చేసుకోవాలని చెబుతున్నారన్నారు. ఇందుకు ఎమ్మెల్యే స్పందించి, మండల సర్వేయర్ సక్రమంగా విధులు నిర్వహించకుంటే వెంటనే మరో సర్వేయర్ను నియమించాలని తహసీల్దార్ శ్రీనివాస్రెడ్డికి సూచించారు.
అదే విధం గా గ్రామంలో కొన్ని అసైన్డ్ భూములను అక్రమంగా పట్టాలు చేసుకున్నారని గ్రామస్తులు ఎమ్మెల్యే దృష్టికి తీసుకొచ్చారు. దీనికి స్పందించిన ఆయన 2013 తరువాత ఎలాంటి అసైన్డ్ భూములు ఇవ్వలేదని, అలా ఏమైనా ఇచ్చినవి ఉంటే వెంటనే విచారించి చర్యలు తీసుకోవాలని చెప్పారు. విద్యుత్ సరఫరాకు సంబంధించిన సమస్యలు వెంటనే పరిష్కరించాలన్నారు. ఇందుకు గాను రూ రూ. 5లక్షలు నిధులు ఇస్తానని చెప్పారు. గ్రామంలో ట్రాన్స్ఫార్మర్ మార్చాలని పలువురు కోరగా, ఆ పనులు వెంటనే ప్రారంభించాలని సంబంధిత అధికారులకు ఆయన సూచించారు. కార్యక్రమంలో సర్పంచ్ బల్వంత్రెడ్డి, పీఏసీఎస్ చైర్మన్ రాంచంద్రారెడ్డి, ఎంపీడీవో బాలయ్య, డాక్టర్ వందన, ఏఈలు వెంకటరమణ, ఎంపీటీసీ ప్రశాంతి, ఆయా గ్రామాల ప్రజా ప్రతినిధులు, అధికారులు పాల్గొన్నారు.
దళితుల ఆర్థిక అభివృద్ధికి అండగా…
ధారూరు, జూన్ 14: తెలంగాణ ప్రభుత్వం దళితులకు అండగా నిలుస్తున్నదని ఎమ్మెల్యే ఆనంద్ అన్నారు. మంగళవారం వికారాబాద్ ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ధారూరు మండలం మోమిన్ఖుర్ధు గ్రామానికి చెందిన శ్రీశైలానికి దళిత బంధు పథకం కింద మంజూరైన కారును అందజేశారు. కార్యక్రమంలో పార్టీ మండల నాయకులు ఉన్నారు.
పిల్లలకు చిన్నతనం నుంచే క్రీడలపై ఆసక్తి పెంచాలి
ధారూరు, జూన్ 14: పిల్లలకు చిన్నతనం నుంచే తల్లిదండ్రులు క్రీడలపై ఆసక్తి పెంచాలని ఎమ్మెల్యే మెతుకు ఆనంద్ అన్నారు. మంగళవారం ధారూరు మండల పరిధిలోని దోర్నాల్ గ్రామంలో ఏర్పాటు చేసిన తెలంగాణ క్రీడా ప్రాంగణాన్ని అధికారులు, ప్రజా ప్రతిని ధులతో కలిసి ప్రారంభించారు.