మొయినాబాద్, సెప్టెంబర్ 5 : గురుకుల విద్యార్థులకు రాష్ట్ర ప్రభుత్వం నాణ్యమైన విద్యను అందిస్తున్నదని చేవెళ్ల ఎమ్మెల్యే కాలె యాదయ్య అన్నారు. మండల పరిధిలోని ఎతుబార్పల్లి గ్రామంలో ఉన్న చేవెళ్ల సాంఘిక సంక్షేమ గురుకుల స్వచ్ఛ పాఠశాల/కళాశాలలో రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న వినూత్న కార్యక్రమం స్వచ్ఛ గురుకుల కార్యక్రమాన్ని ఎంపీపీ నక్షత్రం, జడ్పీటీసీ శ్రీకాంత్లతో కలిసి ఎమ్మెల్యే ప్రారంభించారు.
స్వచ్ఛ గురుకుల కార్యక్రమంలో భాగంగా విద్యా సంస్థల ఆవరణలోని చెత్తాచెదారాన్ని తొలగించాలని సూచించారు. తెలంగాణ రాష్ట్రం వచ్చిన తరువాత పేద విద్యార్థులకు నాణ్యమైన విద్యను అందించాలనే ఆలోచనతో టీఆర్ఎస్ ప్రభుత్వం అనేక గురుకుల పాఠశాలలను ఏర్పాటు చేసిందని చెప్పారు.ప్రతి పేద విద్యార్థిపై రాష్ట్ర ప్రభుత్వం 1.25 లక్షలు ఖర్చు చేస్తున్నదన్నారు. కార్యక్రమంలో కళాశాల ప్రిన్సిపాల్ డి రమాదేవి, సర్పంచ్ నవనీత, శ్రీనివాస్, టీఆర్ఎస్ మండల అధ్యక్షుడు మహేందర్రెడ్డి, ఉపాధ్యక్షుడు జయవంత్, ఎంపీటీసీలు మల్లేశ్, శ్రీనివాస్, అర్జున్, కో ఆప్షన్ సభ్యుడు బిలాల్, నాయకులు ప్రవీణ్రెడ్డి, రాజు, ఉపాధ్యాయులు పాల్గొన్నారు.
చిలుకూరు గురుకులంలో….
మండల పరిధిలోని చిలుకూరు గురుకుల పాఠశాలలో స్వచ్ఛ గురుకుల కార్యక్రమాన్ని ప్రారంభించారు. స్వచ్ఛతపై ప్రతిజ్ఞ చేశారు. విద్యార్థులతో కలిసి ఉపాధ్యాయులు పాఠశాలలోని పరిసరాలను శుభ్రం చేశారు. ఈ నెల 11వ తేదీ వరకు కార్యక్రమాలు జరుగుతాయని హెచ్ఎం తెలిపారు.
ఆసరా కార్డులు అందజేత
మొయినాబాద్ : పేదల సంక్షేమమే ప్రభుత్వ ధ్యేయమని చేవెళ్ల ఎమ్మెల్యే కాలె యాదయ్య అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం నూతనంగా జారీ చేసిన పింఛన్ కార్డులను ఆయన మండలంలోని కనకమామిడి, పెద్దమంగళారం గ్రామాల్లో ఎంపీపీ గునుగుర్తి నక్షత్రం, జడ్పీటీసీ కాలె శ్రీకాంత్, స్థానిక సర్పంచ్లు పి జనార్దన్రెడ్డి, కోట్ల నరోత్తంరెడ్డిలతో కలిసి లబ్ధిదారులకు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రైతులను ఆర్థికంగా బలోపేతం చేయాలనే ఆలోచనతో రాష్ట్ర ప్రభుత్వం రైతు బంధు పథకాన్ని ప్రవేశపెట్టిందన్నారు. కార్యక్రమంలో వైస్ ఎంపీపీ మమత, ఎంపీడీవో సంధ్య, ఎంపీవో వెంకటేశ్వర్రెడ్డి, ఎంపీటీసీలు ప్రభావతి, శ్రీలత, లత, అర్జున్, సర్పంచ్లు శ్రీనివాస్, కుమార్, మాజీ జడ్పీటీసీ అనంతరెడ్డి, ఉప సర్పంచ్ రజిత, పీఏసీఎస్ మాజీ చైర్మన్ పాటి జగన్మోహన్రెడ్డి, టీఆర్ఎస్ మండల అధ్యక్షుడు మహేందర్రెడ్డి, ఏఎంసీ వైస్ చైర్మన్ డప్పు రాజు తదితరులు పాల్గొన్నారు.
పేదల సంక్షేమమే ప్రభుత్వ ధ్యేయం
శంకర్పల్లి : పేదల సంక్షేమమే ప్రభుత్వ ధ్యేయమని ఎమ్మెల్యే కాలె యాదయ్య అన్నారు. మండలంలోని పర్వేద గ్రామంలో, మున్సిపాలిటీ పరిధిలో ప్రభుత్వం మంజూరు చేసిన పింఛన్ కార్డులను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎన్నికలు ఎప్పుడు వచ్చినా తెలంగాణ ప్రజలు టీఆర్ఎస్ పార్టీకే పట్టంకడతారన్నారు. బీజేపీ రాజకీయాలను ప్రజలు గమనిస్తున్నారని, వారికి గుణపాఠం తప్పదని హెచ్చరించారు. కార్యక్రమంలో ఎంపీపీ గోవర్ధన్రెడ్డి, మున్సిపల్ చైర్పర్సన్ విజయలక్ష్మీప్రవీణ్కుమార్, జడ్పీటీసీ గోవిందమ్మ, ఎంపీడీవో వెంకయ్య, వైస్ చైర్మన్ వెంకట్రాంరెడ్డి, సర్పంచ్లు అనిత, రాములు, శ్రీకాంత్, శాంత చెన్నయ్య, ఇందిర, అలివేలు, టీఆర్ఎస్ మండల,మున్సిపల్ అధ్యక్షులు గోపాల్, వాసుదేవ్ కన్నా, ఎంపీటీసీలు మేఘన, వెంకట్రెడ్డి, కౌన్సిలర్లు చాకలి అశోక్, సంధ్యారాణి, శ్వేత, పాండురంగారెడ్డి, వాణి పాల్గొన్నారు.