కడ్తాల్ : ప్రజా సంక్షేమమే ధ్యేయంగా రాష్ట్ర ప్రభుత్వం పని చేస్తున్నదని ఎమ్మెల్సీ కసిరెడ్డి నారాయణరెడ్డి అన్నారు. మండలంలోని ఏక్వాయిపల్లి గ్రామానికి చెందిన పుష్పలతకి రూ.14 వేలు, వెల్దండ మండలం రాచూర్ గ్రామానికి చెందిన సురేందర్రెడ్డికి రూ. 1,50,000 లక్షలు, దుబ్బతండాకి చెందిన పీలునాయక్కి రూ. 10 వేలు, రేఖకి రూ. 12 వేలు ముఖ్యమంత్రి సహాయనిధి చెక్కులు మంజూరయ్యాయి. శనివారం హైదరాబాద్లో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఎమ్మెల్సీ కసిరెడ్డి నారాయణరెడ్డి లబ్ధిదారులకు సీఎంఆర్ఎఫ్ చెక్కులను అందజేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్సీ మాట్లాడుతూ రాష్ట్రంలోని అన్ని వర్గాల సంక్షేమానికి ప్రభుత్వం పథకాలను అమలు చేస్తున్నదని తెలిపారు. సీఎంఆర్ఎఫ్ పథకం పేదలకందరికి వరంలా మారిందని, ఈ పథకం ఎంతో మంది పేదల జీవితాల్లో వెలుగులు నింపిదని పేర్కొన్నారు. కార్యక్రమంలో నాయకులు సురేందర్రెడ్డి, రఘురాములు, సుమన్గౌడ్ పాల్గొన్నారు.