మణికొండ : ప్రజా సంక్షేమం మా సర్కారు ప్రధాన లక్ష్యమని, శివారు మున్సిపాలిటీలపై మంత్రి కేటీఆర్ ప్రత్యేక చొరవ చూపుతున్నా రని రాజేంద్రనగర్ నియోజకవర్గ శాసనసభ్యులు టి.ప్రకాష్గౌడ్ అన్నారు. మంగళవారం నార్సింగి మున్సి పాలిటీ పరిధిలోని 1,2,3,5,6,8,9,11,18 వార్డుల్లో రూ. రూ.5కోట్ల 65లక్షల నిధులతో ఏర్పాటు చేయనున్న పలు పలు అభివృద్ది కార్యక్రమాలకు శంఖుస్థాపన, ప్రారంభోత్సవాలల్లో పాల్గొన్నారు.
ఈ సందర్బంగా స్థానిక మున్సిపాలిటీ చైర్పర్సన్ దారుగుపల్లి రేఖయాదగిరి, వైస్ చైర్మన్ వెంకటేష్యాదవ్, కమిషనర్ సత్యబాబులతో కలిసి వట్టినాగులపల్లిలోని 2వ వార్డు వివేకానందకాలనీలో ఓపెన్ జిమ్, సీసీ రోడ్డులను ప్రారంభించారు. అదేవిధంగా 1వ వార్డుల్లో డ్రైనేజీ పనులను, గండిపేటలోని 11వ వార్డులో సీసీ రోడ్డు పనులకు శంఖుస్థాపన చేశారు.
కోకాపేటలోని 3వ వార్డులోని పైప్లైన్ రోడ్డులో సీసీ రోడ్డు, 3,5 వార్డుల పరిధిలో మురుగునీటీ కాలువ నిర్మాణ పనులను ప్రారంభించారు. 5వ వార్డులో వైకుంఠ దామాన్ని ప్రారంభించడంతో పాటు 10,15వ వార్డులల్లో గ్రీన్ల్యాండ్స్ సమీపంలో మురుగునీటి కాలువల నిర్మాణ పనులను ప్రారంభించారు. నార్సింగిలోని 6వ వార్డులో డ్రైనేజీ పనులను,8వ వార్డులో డ్రైనేజీ, మురుగునీటి కాలువల నిర్మాణపనులకు, సీసీరోడ్డు పనులను ప్రారంభించారు.
9వ వార్డులోని కూరగాయల మార్కెట్లో సీసీరోడ్డు పనులను, 18వ వార్డులో డ్రైనేజీ, సీసీ రోడ్డు నిర్మాణ పనులకు ఎమ్మెల్యే ప్రకాష్గౌడ్ శంఖుస్థాపన చేశారు. 9వ వార్డులో సీసీ రోడ్డు పనులతో పాటు ట్రీ పార్కును ప్రారంభించారు. ఈ సందర్బంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ తెలంగాణ ప్రభుత్వం అధికారం చేపట్టిన నాటి నుంచి అన్నివర్గాల సంక్షేమానికి పెద్దపీట వేస్తోందన్నారు.
నార్సింగి మున్సిపాలిటీని అన్నిరంగాలల్లో అభివృద్ది పర్చేందుకు ఇటీవల రూ.30కోట్ల నిధులతో అభివృద్ది పనులకు కౌన్సిల్ తీర్మాణం చేయడం జరిగిందన్నారు. పట్టణాభివృద్దిశాఖ మంత్రి కేటీఆర్ శివారు మున్సిపాలిటీల అభివృద్ది ఆయన ప్రత్యేక చొరవచూపుతున్నారని అన్నారు. ఈ మేరకు ఇప్పటికే నార్సింగి మున్సిపాలిటీ అత్యంత వేగవంతంగా అభివృద్ది చెందుతున్న ప్రాంతమన్నారు.
రాబోయే రోజుల్లో నార్సింగి ప్రాంతం అత్యాధునిక పట్టణంగా మారబోతుందన్నారు. భవిష్యత్తును దృష్టిలో ఉంచుకుని ప్రజావసరాలను గుర్తించి నిధులను కేటాయిస్తు తాగునీరు, మురుగునీటి కాలువల అభివృద్దిపై ప్రత్యేక దృష్టి సారించినట్లు తెలిపారు. కోకాపేట లాంటి ప్రధాన ప్రాంతాలను మరింతగా అభివృద్ది పర్చేలా ప్రభుత్వం ఇప్పటికే ప్రణాళికలు రూపొందించిందన్నారు.
ఈ కార్యక్రమంలో మున్సిపాలిటీ చైర్పర్సన్ రేఖయాదగిరి, వైస్ చైర్మన్ వెంకటేష్యాదవ్, కమీషనర్ సత్యబాబు, కౌన్సిలర్లు శివారెడ్డి, ఆదిత్యారెడ్డి, విజయబాబు, దుర్గేశ్యాదవ్, యాదమ్మ, సునీత, విజేత, శ్రీకాంత్, పత్తిప్రవీణ్ కుమార్, మాజీ ఎంపీపీ మల్లేష్, మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ చంద్రశేఖర్రెడ్డి, మాజీ సర్పంచ్లు ప్రవీణ్యాదవ్, దేవాలయ కమిటీ చైర్మన్ పొన్న రమేశ్, పార్టీ అధ్యక్ష, కార్యదర్శులు నర్సింహ్మ, అరికెమల్లేష్, తదితరులు పాల్గొన్నారు.