తుర్కయాంజాల్, మే 8: ‘కల్లాల్లోనే ధాన్యం’ శీర్షికన శుక్రవారం ‘నమస్తే తెలంగాణ’లో ప్రచురితమైన కథనానికి అధికారులు స్పందించి.. తొర్రూర్ డివిజన్ పరిధిలో ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని శనివారం ప్రారంభించారు. తుర్కయాంజాల్ రైతుసేవా సహకార సంఘం, పీఐసీ చైర్మన్ సత్తయ్య తొర్రూర్లో ఏర్పాటు చేసిన కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించారు. కార్యక్రమంలో రైతుబంధు సమితి రంగారెడ్డి జిల్లా మాజీ అధ్యక్షుడు వంగేటి లక్ష్మారెడ్డి, తుర్కయాంజాల్ రైతుసేవా సహకార సంఘం డైరెక్టర్లు రాంరెడ్డి, కృష్ణారెడ్డి, డీసీఎంఎస్ అధికారులు, రైతులు పాల్గొన్నారు.