శంకర్పల్లి జూన్ 6 : శంకర్పల్లి మున్సిపాలిటీలోని సమస్యల పరిష్కారానికే మొదటి ప్రాధాన్యత ఇవ్వాలని చేవెళ్ల ఎమ్మెల్యే కాలె యాదయ్య పేర్కొన్నారు. పట్టణ ప్రగతిలో భాగంగా సోమవారం మున్సిపల్ పరిధిలో చైర్ పర్సన్ విజయలక్ష్మితో కలిసి ఇంద్రారెడ్డి స్టేడియం, ప్రభుత్వ దవాఖాన ఆవరణలో క్రీడా ప్రాంగణాలను ప్రారంభించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. పట్టణ ప్రగతితో మున్సిపాలిటీల రూపు రేఖలు మారుతాయన్నారు.
తెలంగాణ ప్రభుత్వం పట్టణాల అభివృద్ధికి కోట్ల రూపాయాలు ఖర్చు చేసి అభివృద్ధి చేస్తున్నాయని కొనియాడారు. క్రీడా ప్రాంగణాలను ప్రతి ఒక్కరు సద్వినియోగం చేసుకోవాలని ఎమ్మెల్యే సూచించారు. గ్రామీణ క్రీడా కారుల ప్రతిభను వెలికి తీయడానికే క్రీడా ప్రాంగణాలను సీఎం కేసీఆర్ ఎర్పాటు చేశారని అన్నారు.
కార్యక్రమంలో మున్సిపల్వైస్ చైర్మన్ వెంకట్రాంరెడ్డి, మున్సిపల్ కమిషనర్ యాదగిరి, కౌన్సిలర్లు శ్వే, పాండురంగారెడ్డి, పార్శి రాధ, బాలకృష్ణ, వాణి గుప్తా, చంద్రమౌళి, శ్రీనాథ్గౌడ్, చాకలి అశోక్, లక్ష్మమ్మ, సంధ్యారాణి, కో ఆప్షన్ సభ్యులు షబానా బేగం, తదితరులు పాల్గొన్నారు.