ఆదిబట్ల, జనవరి 3 : ప్రైవేట్ స్కూల్ బస్సు బీభత్సంతో ఓ ఆటో, నాలుగు బైకులు ధ్వంసమైన ఘటన మంగళవారం సాయంత్రం జరిగింది. ఆదిబట్ల మున్సిపాలిటీ పరిధి బొంగుళూరు గేటు సమీపంలో నగరంలోని వనస్థలిపురంలోని నాగార్జున స్కూల్కు చెందిన బస్సు మంగళవారం సాయంత్రం విద్యార్థులను ఇండ్ల వద్ద వదిలి పెట్టి వస్తున్నది.
బొంగుళూరు గేటు సమీపంలో రోడ్డు పక్కన ఉన్న వాహనాలను ఢీకొట్టగా.. ఒక ఆటో, నాలుగు బైకులు ధ్వంసమయ్యాయి. దీంతో స్థానికులు ఆగ్రహానికి గురై డ్రైవర్ను చితకబాదారు. డ్రైవర్ మద్యం మత్తులో ఉన్నాడని ఆరోపించారు. రోడ్డుపై జనం ఉంటే పెద్దఎత్తున ప్రాణ నష్టం జరిగేదని వారు తెలిపారు.