బొంరాస్పేట/మర్పల్లి/కొడంగల్/ధారూరు/మోమిన్పేట /కులకచర్ల : మండలంలోని తుంకిమెట్ల, బొట్లవానితండాల్లో టీఆర్ఎస్ గ్రామ కమిటీల ఎన్నిక కార్యక్రమానికి కొడంగల్ ఎమ్మెల్యే పట్నం నరేందర్రెడ్డి శనివారం ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. టీఆర్ఎస్ పార్టీని మరింత బలోపేతం చేయడానికి గ్రామ, వార్డు స్థాయి నుంచి కమిటీలు వేస్తున్నామని, ఈ కమిటీల్లో ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ, మహిళలకు సమాన ప్రాధాన్యం ఉంటుందని ఎమ్మెల్యే స్పష్టం చేశారు. కొడంగల్ మున్సిపల్ పరిధిలోని 9వ వార్డులో టీఆర్ఎస్ జెండా పండుగలో భాగంగా జెండా ఆవిష్కరించారు. తుంకిమెట్ల, బొట్లవానితండా, కొత్తూరు, వడిచెర్ల, ఎన్నెమీదితండా(కొత్తూరు), ఎన్నెమీదితండా(వడిచెర్ల) గ్రామ అధ్యక్షులుగా చాకలి అంజిలయ్య, బాలునాయక్, బాల్రెడ్డి, హరీశ్వర్రెడ్డి, గోపాల్, హన్మ్యానాయక్, కార్యదర్శులుగా గూని అంజిలయ్యగౌడ్, అర్జున్, లాలప్ప, నారాయణగౌడ్, రాజునాయక్, నార్యానాయక్ ఎన్నికయ్యారు.
మల్లికార్జునగిరి గ్రామ అధ్యక్షుడిగా మహిపాల్, రైతు బంధు సమితి అధ్యక్షుడిగా సూరయ్య, రైతు బంధు సమితి మండల సభ్యుడిగా శ్రీశైలం యాదవ్, సోషల్ మీడియా కన్వీనర్గా సుమన్, గ్రామ యూత్ అధ్యక్షుడిగా సంపత్, మైనార్టీ అధ్యక్షుడిగా ఉస్మాన్, కొంషెట్పల్లి గ్రామ అధ్యక్షుడిగా వీరేశంగౌడ్, ఉపాధ్యక్షులుగా ఇమ్రాన్, శ్రీనివాస్, రైతు బంధు సమితి గ్రామ అధ్యక్షుడిగా శ్రీనివాస్, సోషల్ మీడియా కన్వీనర్లుగా అశోక్, మధుగౌడ్ ఎన్నికయ్యారు. అంపల్లి, పులిచింతలమడుగుతండా గ్రామ అధ్యక్షులుగా మల్లేశం, రమేశ్ నాయక్, ప్రధాన కార్యదర్శులుగా రాములు నాయక్, గుండేశ్ నాయక్ ఎన్నికయ్యారు.
దుర్గంచెర్వు అధ్యక్షుడిగా సీహెచ్ కృష్ణ, ఎస్సీ కమిటీ అధ్యక్షుడిగా ఆర్.శ్రీనివాస్, బీసీ కమిటీ అధ్యక్షుడిగా బి.రాజు, మైనార్టీ కమిటీ అధ్యక్షుడిగా ఎండీ షరీఫ్, మహిళా కమిటీ అధ్యక్షురాలిగా టి.శివమ్మ, యువజన విభాగం కమిటీ అధ్యక్షుడిగా బి.మహేందర్, ఉపాధ్యక్షులు, కార్యదర్శులను నియమించారు. పటేల్చెరువుతండా, కామునిపల్లి, రాంరెడ్డిపల్లి, ముజాహిద్పూర్, అల్లాపూర్, పీరంపల్లి గ్రామ కమిటీల అధ్యక్షులుగా వి.రాములు, సున్నల తిరుపతయ్య, ఈడిగి అంజిలయ్య, మాసని పెంటయ్య, విస్లావత్ సతీష్, చాకలి మొగులయ్య, ప్రధాన కార్యదర్శులుగా కె.లక్ష్మణ్, శాగంటి కిష్టయ్య, బంగరి పెద్ద నర్సింలు, చిట్టెల యాదయ్య, హన్మంతు, నక్క అనంతయ్య ఎన్నికయ్యారు.