బషీరాబాద్, డిసెంబర్ 5: తెలంగాణ ప్రభుత్వం గ్రామాల్లో మౌలిక సదుపాయాల కల్పనకు ఎనలేని కృషి చేస్తున్నదని తాండూరు ఎమ్మెల్యే రోహిత్రెడ్డి అన్నారు. సోమ వారం ‘పల్లె పల్లెకు పైలెట్’ కార్యక్రమాన్ని ఏకాంబరి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వ హించి అట్టహాసంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఆలయాల అభివృద్ధిలో భాగంగా తెలంగాణ ప్రభుత్వం రామలింగేశ్వర ఆలయ అభివృద్ధికి రూ. కోటి మంజూరు చేసిందన్నారు.
ఈ నిధులతో ఆలయాన్ని అన్ని విధాలా అభివృద్ధి చేస్తామ న్నారు. అలాగే గ్రామాల్లో మౌలిక సదుపాయాల కల్పనలో భాగంగా సైడ్ డ్రెయిన్లు, సీసీ రోడ్లు నిర్మాణానికి నిధులు మంజూరు చేసిందన్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్, మంత్రులు కేటీఆర్, సబితా ఇంద్రా రెడ్డి, ఎంపీ రంజిత్రెడ్డి సహకారంతో తాండూరుకు అధిక నిధులు మంజూరు అయ్యా యని తెలిపారు. తెలంగాణ రాష్ట్రం సాధించాకా ఎన్నో సంక్షేమ పథకాలను ప్రవేశపెట్టి అన్ని వర్గాల ప్రజలకు ఫలాలు అందుతున్నాయని తెలిపారు.
వ్యవసాయానికి 24 గంటల ఉచిత కరెంట్, రైతుబంధు లాంటి పథకాలతో తెలంగాణ దేశానికే ఆదర్శంగా నిలిచిం దన్నారు. తాండూరు అభివృద్ధి టీఆర్ఎస్తోనే సాధ్యమన్నారు. తన సొంత మండలమైన బషీరాబాద్ మండలం అభివృద్ధికి అధిక ప్రాధాన్యం ఇస్తామని ఈ సందర్భంగా పేర్కొన్నారు. కార్యక్రమంలో జిల్లా గ్రంథాలయ చైర్మన్ రాజుగౌడ్, పార్టీ మండల అధ్యక్షుడు రామునాయక్, పీఏసీఎస్ చైర్మన్ వెంక ట్రాంరెడ్డి, నాయకులు నర్సిరెడ్డి(రాజు), గోపాల్రెడ్డి, సికిందర్ఖాన్, శివరాం నాయ క్, పాండురంగారెడ్డి, రుక్మారెడ్డి, వెంకటయ్య, ముకుంద్, నరేశ్ చవాన్, హన్మంత్రెడ్డి, సర్పంచ్లు లాలు, సూర్యానాయక్, దేవ్సింగ్, నర్సిరెడ్డి, ఎంపీటీసీలు లక్ష్మీబాయి, రాజు, పలు గ్రామాల నాయకులు కార్యకర్తలు ఉన్నారు.