షాద్నగర్టౌన్, అక్టోబర్ 23: పట్టణంలోని ఎల్ఎస్ఎన్ ఫంక్షన్హాల్, జీహెచ్ఆర్ గార్డెన్తోపాటు పలు చోట్ల పటాకుల షాపులను ఏర్పా టు చేశారు. గతేడాదితో పోలిస్తే బాణసంచా ధరలు పెరిగినట్లు పలువురు పేర్కొన్నారు. సాధారణ పటాకులు కేజీ 600, చిచ్చుబుడ్లు(బాక్స్)రూ. 150 నుంచి 600, బూచక్రాలు(బాక్స్)రూ.60నుంచి రూ.400, రాకెట్స్(బాక్స్)రూ.110-400, లక్ష్మీబాంబుల (ప్యాకెట్) రూ.16 నుంచి 300, థౌజెండ్వాలా రూ. 300-రూ. 2000వరకు అందుబాటులో ఉన్నాయి.
అదేవిధంగా పూల ధరలు కూడా పెరిగాయి. కనకాంబరాలు కేజీ రూ.1000, బంతికేజీ రూ.60-70, చామంతి రూ. 100-150, కాగడపూలు రూ.500- 600, గులాబీ రూ.300, తెల్లచామంతి కేజీ రూ.150-200, సెట్ గులాబీ రూ.200-250ధరలు పలుకుతున్నాయి. అదేవిధంగా డజన్ మట్టి ప్రతిమలు రూ.30-40, అమ్మవారి రూపంలో ఉన్న ప్రతి మ 150 నుంచి రూ.250, దొంతులు రూ. 250, కుందన్ దొంతులు రూ.350, నోముల ప్రతిమలు ఒక్కోటి రూ.50-150, ఫ్యాన్సీ దీపాంతల జోడి రూ.10-రూ.250 వరకు పలుకుతున్నాయి.