తాండూరు, ఏప్రిల్ 9: సంప్రదాయ పంటలు సాగు చేస్తూ నష్టాల ఊబిలో చిక్కుకున్న రైతులు నూతన ఒరవడికి శ్రీకారం చుట్టారు. అప్పుల పాలు కాకుండా ఉండేందుకు పంట మార్పిడి చేస్తూ మిర్చి సాగుచేస్తున్నారు. మిరప తోట సాగులో తక్కువ పెట్టుబడితో ఎక్కువ దిగుబడి సాధిస్తూ లాభాలు గడిస్తున్నాడు శ్రీనివాస్రావు. ఆంధ్రప్రదేశ్ గుంటూరుకు చెందిన శ్రీనివాస్రావు 15 సంవత్సరాలుగా వికారాబాద్ జిల్లా తాండూరు నియో జకవర్గం యాలాల మండలం సంగెంకుర్ధు గ్రామంలో 100 ఎకరాల భూమిని కౌలుకు తీసుకుని సంప్రదాయ పద్ధతుల్లో వివిధ పంటలు పండిస్తున్నాడు. పత్తి, మిర్చి, ఉల్లిగడ్డ, పసుపు, వరి, మొక్కజొన్నతో పాటు పలు రకాల పంటలు పండిస్తున్నాడు.
పంటమార్పిడి చేపట్టడంతో అనుకున్న విధంగా పంటలు పండించడంతో మంచి లాభాలు వస్తున్నాయని రైతు పేర్కొంటున్నాడు. వ్యవసాయంలో గతేడాది వరకు నష్టాలు చవిచూడడంతో ఇప్పు డు మార్కెట్లో డిమాండ్ ఉన్న పంటల సాగు చేసి రైతులు లాభాలు గడిస్తున్నారు. ఎండు మిర్చి సాగు రైతులకు మంచి లాభాలు తెచ్చిపెడుతున్నది.సంగెంకుర్ధులో శ్రీనివాస్రావు 35 ఎకరాలకు పైగా సాగు చేసిన మిరప పంట ఆశాజనకంగా ఉంది. దీంతో నియోజక వర్గంలో ఈ ఏడాది ఎక్కువ మంది రైతులు మిరప సాగు చేసేందుకు సన్నద్ధమవుతు న్నారు. ఎకరా పంట సాగుకు మిరప పైరు, మందులు, ఎరువులు రూ.30 నుంచి రూ.40 వేల వరకు పెట్టుబడి అవుతున్నది. మార్కెట్లో ప్రస్తుతం క్వింటాలు ఎండు మిర్చి రూ.20 నుంచి రూ.25 వేల ధర పలుకుతున్నది. ఖర్చు మొత్తం పోనూ ఎకరాకు రూ.లక్ష దాకా ఆదాయం ఉంటుందని రైతులు చెబుతున్నారు.
పదేళ్లుగా మిర్చి సాగు
పదేళ్లుగా మిర్చిపంటను సాగు చేస్తున్నాను. సాగు చేసిన నెల తర్వాత మొదటి క్రాప్ పచ్చిమిరప కాయలను తొలగించవచ్చు. అనంతరం ఎండుమిర్చి కోసం కాపును తీయం. దోరగా ఎరుపురంగులోకి రాగానే ఎండుమిర్చి కోసం కాపు తీస్తాము. పూర్తిగా ఎండేవరకు ఆరబెట్టి ఎండిన తర్వాత సంచుల్లో నింపి మార్కెట్కు వేస్తాం. ప్రస్తుతం మార్కెట్లో మిర్చి ధర బాగుంది. మంచి ఆదాయం పొందుతున్నాను. -శ్రీనివాస్రావు, రైతు