యాచారం : మండలంలోని తమ్మలోనిగూడలో బుధవారం బీరప్ప, బుగ్గ పోచమ్మ, మహంకాళి దేవతల విగ్రహా ప్రతిష్ట కార్యక్రమం గొల్ల, కురుమ సంఘం ఆధ్వర్యంలో కన్నుల పండువగా జరిగింది. దేవతా విగ్రహా ప్రతిష్ఠలతో పాటు ధ్వజ స్తంభాన్ని సర్పంచ్ కాలె సంతోష సమక్షంలో ప్రతిష్టించారు. గ్రామస్తులు, భక్తులు, గొల్లకురుమ సంఘాల పెద్దలు, వివిధ పార్టీల నాయకులు పెద్ద ఎత్తున ఆలయాల్లో పూజలు నిర్వహించారు. దీంతో గ్రామంలో ఒక్కసారిగా పండుగ వాతావరణం నెలకొంది. ఇబ్రహీంపట్నం ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్రెడ్డి, టీఆర్ఎస్ రాష్ట్ర నాయకుడు క్యామ మల్లేష్లు, టీఆర్ఎస్ మండల అధ్యక్షుడు కర్నాటి రమేశ్గౌడ్ ఆలయాన్ని సందర్శించి ప్రత్యేక పూజలు చేశారు.
అనంతరం వారిని ఆలయ పెద్దలు, ప్రజాప్రతినిధులు ఘనంగా సన్మానించారు. స్వామివారి తీర్థ ప్రసాదాలను స్వీకరించి కానుకలు సమర్పించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్రెడ్డి మాట్లాడుతూ దేవాలయాల అభివృద్ధికి ప్రభుత్వం పెద్ద పీఠ వేస్తుందన్నారు. యాదాద్రి ఆలయాన్ని తిరుపతిని తలపించేలా, చరిత్రలో నిలిచేలా సీఎం కేసీఆర్ నిర్మిస్తున్నారన్నారు. కార్యక్రమంలో పీఏసీఎస్ చైర్మన్ రాజేందర్రెడ్డి, వైస్ చైర్మన్ యాదయ్య, డీసీసీబీ వైస్ చైర్మన్ కొత్తకుర్మ సత్తయ్య, సర్పంచ్లు హబీబుద్దీన్, జగదీష్, డేరంగుల రాజు, టీఆర్ఎస్ మండల ప్రధాన కార్యదర్శి పాచ్చ భాష, టీఆర్ఎస్ నాయకులు తలారి మల్లేష్, కాలె మల్లేష్, ఖాజు, జర్కోని రాజు ఆలయ నిర్వాహకులు, గొల్ల, కురుమ సంఘం నాయకులు, గ్రామస్తులు పాల్గొన్నారు.