కేంద్ర ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు లోక్ సభ ఎన్నికల నిర్వహణకు రంగారెడ్డి జిల్లా యంత్రాంగం సన్నద్ధమవుతున్నది. జిల్లాలో చేవెళ్ల, భువనగిరి పార్లమెంటు స్థానాలకు ఎన్నికలు జరుగనున్నాయి. ఈ నేపథ్యంలో ఓటరు జాబితా తయారీలో అధికారులు నిమగ్నమయ్యారు. ఓటు హక్కు నమోదు, చేర్పులు, మార్పులకూ ఎన్నికల సంఘం అవకాశం కల్పించింది. ఓటరు నమోదు ప్రక్రియను వేగవంతం చేస్తూ ఓటరు తుది జాబితాను ఫిబ్రవరి 8న అధికారులు విడుదల చేయనున్నారు.
అసెంబ్లీ ఎన్నికలకంటే లోక్సభ ఎన్నికల్లో పోలింగ్ కేంద్రాల సంఖ్య మరింతగా పెరిగే అవకాశం ఉండడంతో పోలింగ్ బూత్ల సవరణకూ జిల్లా యంత్రాంగం చర్యలు చేపడుతున్నది. రెవెన్యూ, పోలీస్, ఆబ్కారీ శాఖల అధికారుల బదిలీలపై కేంద్ర ఎన్నికల సంఘం నజర్ పెట్టింది. మూడేండ్లుగా ఒకేచోట పని చేస్తున్న ఉద్యోగులను బదిలీ చేసేందుకు కసరత్తు చేస్తున్నది. ప్రస్తుతం జిల్లాలో 35,22,420 మంది ఓటర్లు ఉండగా.. లోక్ సభ ఎన్నికల నాటికి ఈ సంఖ్య మరింతగా పెరిగే అవకాశం ఉన్నది.
రంగారెడ్డి, డిసెంబర్ 31(నమస్తే తెలంగాణ): లోక్సభ ఎన్నికలు సమీపిస్తుండడంతో కేంద్ర ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు జిల్లా యం త్రాంగం సన్నద్ధమవుతున్నది. ఓ వైపు ఓటర్ల జా బితాకు రూపకల్పన చేస్తూనే.. మరోవైపు పోలిం గ్ బూత్ల సవరణకు వేగవంతంగా చర్యలు చేపడుతున్నది. మూడు శాఖల్లో ఉద్యోగుల బదిలీల ప్రక్రియను సైతం చేపట్టేలా కసరత్తు జరుగుతున్నది. ప్రతి పోలింగ్ కేంద్రంలోను ఓటర్ల సంఖ్య 1,500 మందికి మించకుండా పోలింగ్ కేంద్రాల హేతుబద్ధీకరణ ప్రక్రియ కొనసాగుతున్నది. దీం తో అసెంబ్లీ ఎన్నికల్లో ఏర్పాటు చేసిన దానికంటే పోలింగ్ కేంద్రాల సంఖ్య లోక్సభ ఎన్నికల్లో మ రింతగా పెరిగే అవకాశం ఉంది. చేర్పులు, మా ర్పుల అనంతరం ఫిబ్రవరి 8న తుది ఓటరు జాబితాను విడుదల చేసేందుకు అధికారులు స ర్వం సిద్ధం చేస్తున్నారు.
ప్రతి పోలింగ్ కేంద్రంలో 1,500 మంది ఓటర్లు ఉండాలని ఎన్నికల సంఘం నిర్దేశించింది. ఈ మేరకు అధికారులు ఆ దిశగా చర్యలు తీసుకుంటున్నారు. కొన్ని కేంద్రాల్లో 1,500 మంది ఓటర్లకు తక్కువగా, మరికొన్ని చోట్ల అంతకుమించి ఓటర్లు ఉన్నారు. ఎక్కువ మంది ఉన్న కేంద్రాల ఓటర్లను సమీప కేంద్రంలో విలీనం చేయడమా? లేక కొత్తగా మరో కేంద్రాన్ని ప్రతిపాదించడమా? అనే విషయాన్ని అధికారులు పరిశీస్తున్నారు.
ఒక కాలనీకి చెందిన ఓటర్లు వేర్వేరు పోలింగ్ కేం ద్రాల పరిధిలో ఉండడంతో ఇబ్బందులు ఎదురవుతున్నాయి. ఈ ఇబ్బందుల దృష్ట్యా ఒక కాలనీలోని ఓటర్లందరూ ఒకే చోట ఓటు వేసేలా ఏర్పాట్లు చేస్తున్నారు. ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా కేంద్రాల్లో వసతుల లేమితోఎదురైన ఇబ్బందులు లోక్సభ ఎన్నికల్లో పునరావృతం కాకుండా చర్యలు తీసుకుంటున్నారు. కేంద్రాల హేతుబద్ధీకరణ చర్యలతో అసెంబ్లీ ఎన్నికల్లో ఉన్న 3,453 పోలింగ్ కేంద్రాల సంఖ్య మ రింతగా పెరిగే అవకాశం ఉంది.
చేవెళ్ల, మహేశ్వరం, రాజేంద్రనగర్, శేరిలింగంపల్లి, వికారాబాద్ జిల్లాలోని వికారాబాద్, తాం డూరు, పరిగి అసెంబ్లీ సెగ్మెంట్లు చేవెళ్ల లోక్సభ పరిధిలో ఉన్నాయి. భుననగిరి లోక్సభ పరిధిలో నల్లగొండ, యాదాద్రి భువనగిరి, సూర్యాపేట జి ల్లాలకు చెందిన భువనగిరి, ఆలేరు, మునుగోడు, తుంగతుర్తి, నకిరేకల్తోపాటు జనగామ జిల్లాలో ని జనగామ, రంగారెడ్డి జిల్లాలోని ఇబ్రహీంప ట్నం సెగ్మెంట్లు ఉన్నాయి. రంగారెడ్డి జిల్లా పరిధి లో ఉన్న శాసనసభ నియోజకవర్గాల్లో లోక్సభ ఎన్నికలకు అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు.
ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా ఒక దఫా ఓటరు జాబితాకు రూపకల్పన చేసిన అధికార యంత్రాంగం లోక్సభ ఎన్నికల వేళ మరోసారి జాబితా తయారీలో నిమగ్నమైనది. 2024 జనవరి 1 నాటికి 18 ఏండ్లు నిండిన వారు ఓటరుగా నమోదు చేసుకునేందుకు అవకాశం కల్పిస్తూనే మార్పులు, చేర్పులకూ అవకాశం ఇచ్చారు. వచ్చే ఏడాది జనవరి 6వ తేదీన ఓటర్ల ముసాయిదా జాబితాను ప్రకటించి ఫిబ్రవరి 8వ తేదీన తుది ఓటర్ల జాబితాను ప్రకటించనున్నారు. ప్రస్తుతం జిల్లాలో 35,22,420 మంది ఓటర్లు ఉండగా.. లోక్సభ ఎన్నికల నాటికి ఓటర్ల సంఖ్య మరింతగా పెరిగే అవకాశం ఉంది.
లోక్సభ ఎన్నికల సందర్భంగా మూడు శాఖల అధికారుల బదిలీలపై కేంద్ర ఎన్నికల సంఘం నజర్ పెట్టింది. రెవెన్యూ, పోలీస్ శాఖలతోపాటు ఆబ్కారీ శాఖ సిబ్బంది ఎన్నికల్లో కీలక బాధ్యతలు నిర్వహిస్తూ వస్తున్నారు. ఈ మే రకు ఆయా శాఖల్లో మూడేండ్ల పాటు ఒకే చోట పనిచేస్తున్న ఉద్యోగులను బదిలీ చేయాలని ఎన్నికల సంఘం ఆదేశించింది. ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల సందర్భంలో జిల్లా లో చాలా మంది బదిలీలు జరుగగా మిగిలిన వారిని లోక్సభ ఎన్నికల సందర్భంగా బదిలీ చేసే అవకాశం ఉంది. ఈ బదిలీల్లో జిల్లా, డివిజన్, మండల స్థాయి అధికారులకు కూడా స్థాన చలనం కలగనున్నది. ఈ ప్రక్రియను చేపట్టేందుకు జిల్లాలో బదిలీకి అర్హులైన వారి వివరాలను సేకరిస్తున్నట్లు తెలుస్తున్నది.