కొత్తూరు, మే 19: దీపక్ హత్య కేసును పోలీసులు ఛేదించారు. గురువారం కొత్తూరు పోలీస్స్టేషన్లో జరిగిన విలేకరుల సమావేశంలో షాద్నగర్ ఏసీపీ కుషాల్కర్ వివరాలను వెల్లడించా రు. ఈ నెల 9న రాత్రి 11 గంటల సమయంలో కొత్తూరుకు చెందిన ఇంటర్ చదువుతున్న ఇద్దరు మైనర్లు నేషనల్ హైవే 44 కొత్తూరు అండర్ పాస్ కింది నుంచి గంజాయి మత్తులో కొత్తూరు వైపు వస్తున్నారు. అదే సమయంలో మద్యం మత్తులో ఉన్న దీపక్ వారి కంటపడ్డాడు. దీంతో వారు ఎక్కడికెళ్లాలి మేము తీసుకెళ్తామని అతడిని పట్టుకోబోగా దీపక్ వారిపై చేయి చేసుకున్నాడు. దీంతో ఇరువురి మధ్య గొడవ జరిగింది. ఆగ్రహానికి గురైన ఆ ఇద్దరు మైనర్లు అతడిని చేతులతో కొట్టి కింద పడేసి పక్కనే ఉన్న బండరాయిని తలపై కొట్టడంతో అక్కడికక్కడే చనిపోయాడు. అనంతరం వారు అతడి జేబులో ఉన్న పర్సును తీసుకుని అక్కడి నుంచి పరారయ్యారు.
సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలికెళ్లి మృతదేహాన్ని మార్చురీకి తరలించి.. కేసు నమోదు చేసుకుని అదే రోజు రాత్రి నుంచి దర్యాప్తును ప్రారంభించారు. హత్య జరిగిన ప్రాంతం లో ఉన్న ఆరు సీసీ కెమెరాలను పరిశీలించి ఇద్దరు మైనర్లు దీపక్ను హత్య చేసినట్లుగా పోలీసులు గుర్తించారు. కాగా హత్య జరిగిన మరుసటి రోజు కొత్తూరు రైల్వేస్టేషన్ దగ్గరలోని ఒక ఇంటి వద్ద నిలిపిన బైక్ను ఆ ఇద్దరు మైనర్లు చోరీ చేశా రు. ఆ బైక్ను షాద్నగర్ రైల్వేస్టేషన్ వద్ద విక్రయించేందుకు వారు ప్రయత్నిస్తుండగా కొత్తూరు పోలీసులు వారిని అదుపులోకి తీసుకున్నారు. వారి వద్ద మృతుడి ఫొటోతో ఉన్న పర్సు లభించింది. అందులో ఉన్న రూ.3200 స్వాధీనం చేసుకున్నారు. కేసును ఛేదించిన పోలీసులను షాద్నగర్ ఏసీపీ కుషాల్కర్ అభినందించిన రివార్డు అందజేశారు. కొత్తూరు సీఐ బాల్రాజు పర్యవేక్షణలో ఎస్ఐ శంకర్, ఏఎస్ఐ అబ్దుల్లా, శ్రీనివాస్రెడ్డి, కుమార్, శ్రీనివాస్, హరీశ్ కేసును ఛేదించారు.