ముదిగొండ, ఆగస్టు 14 : అన్ని రకాల ప్రభుత్వ పెన్షన్లకు దరఖాస్తు చేసుకునే వారితోపాటు వృద్ధాప్య పెన్షన్కూ అవకాశం కల్పించాలని బీఆర్ఎస్ డిమాండ్ చేసింది. ఈ మేరకు ముదిగొండ మండల కేంద్రంలో ఆ పార్టీ నాయకులు శుక్రవారం నిరసన ప్రదర్శన చేపట్టారు. బస్టాండ్ సెంటర్ నుంచి మండల పరిషత్ కార్యాలయం వరకు ప్రదర్శనగా వెళ్లి ధర్నా చేపట్టారు.
అనంతరం తహసీల్దార్, ఎంపీడీవోలకు వినతిపత్రాలు సమర్పించారు. ఈ సందర్భంగా పలువురు నాయకులు మాట్లాడుతూ ఎన్నికల ముందు ఇచ్చిన హామీ మేరకు కాంగ్రెస్ ప్రభుత్వం ప్రస్తుత పెన్షన్లను పెంచాలని డిమాండ్ చేశారు. కొత్తగా ఇవ్వనున్న పెన్షన్లలో వృద్ధాప్య పెన్షన్ లేనందున వారికి కూడా అవకాశం ఇవ్వాలని కోరారు. దీనిపై ప్రభుత్వం సానుకూలంగా స్పందించాలని, లేదంటే వృద్ధులను కలుపుకొని మరిన్ని ఆందోళనలు చేపడతామని హెచ్చరించారు.
బీఆర్ఎస్ నాయకులు వాచేపల్లి లక్ష్మిరెడ్డి, సామినేని హరిప్రసాద్, గడ్డం వెంకట్, బంక మల్లయ్య, పచ్చ సీతారామయ్య, కనగాల వెంకటేశ్వర్లు, మరికంటి లాలయ్య, ఆనందరావు, మాలోజి గోవిందు, ఎండీ ఖాసీం బాబు, వడ్డెల్లి కిరణ్, తాటికొండ ఉపేందర్, సామినేని నాగేశ్వరరావు, షేక్ ఖాజా, బత్తుల వెంకట్రావు, పొనుకుల కోటేష్, కోటి అనంత రాములు, బంక విజయ్, పోట్ల ప్రసాద్, పయ్యావుల వెంకటేశ్వరరావు, కొత్తపల్లి పద్మ నాగార్జున, చెరుకుపల్లి భిక్షం, పడిశాల భద్రయ్య, మల్లేపల్లి శంకర్ తదితరులు పాల్గొన్నారు.