వికారాబాద్, నవంబర్ 29 : పోక్సో చట్టంపై అవగాహన కలిగి ఉండాలని మంగళవారం వికారాబాద్ ఎస్పీ కార్యాలయంలోని కాన్ఫరెన్స్ హాల్లో పోలీస్ అధికారులు, మహిళా అధికారులకు శిక్షణా కార్యక్రమం నిర్వహించారు.
ఈ కార్యక్రమంలో భరోసా మహిళా రక్షణ విభాగం నుంచి టెక్నికల్ డైరెక్టర్ మమతారఘువీర్ శిక్షణ నిర్వహించారు. పోక్సో, అత్యాచార బాధితులతో ఎలా ప్రవర్తించాలి.. ఎలా మాట్లాడాలి అనే అంశంపై ప్రత్యేక శిక్షణనిచ్చారు. కార్యక్రమంలో వికారాబాద్ డీఎస్పీ సత్యనారాయణ, డీసీఆర్బీ ఇన్స్పెక్టర్ అప్పయ్య, సీఐలు శ్రీనివాస్రావు, ప్రమీల, ఎస్సైలు, భరోసా బృందం అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.