శంషాబాద్ రూరల్, జూన్ 9: కేరళలోని కొచ్చిన్ నుంచి ఢిల్లీ వెళ్తున్న ఎయిర్ఇండియా విమానం శంషాబాద్ ఎయిర్పో ర్టులో మంగళవారం అత్యవసరంగా ల్యాండ్ అయ్యింది. ఎయిర్లైన్స్ అధికారులు తెలిపిన వివరాల ప్రకారం.. కొచ్చిన్ నుంచి ఢిల్లీ వెళ్తున్న విమానంలోని ఇద్దరు మహిళా ప్రయాణికులకు విపరీతమైన కడుపునొప్పి రావడంతో వారు వెంటనే ఎయిర్లైన్ సిబ్బంది, పైలట్కు సమాచారం ఇచ్చా రు. పైలట్ శంషాబాద్ ఎయిర్పోర్టు అధికారులకు సమాచారం ఇవ్వగా.. ఏటీసీ అధికారుల సూచన మేరకు శంషాబాద్ ఎయిర్పోర్టు లో అత్యవసరంగా ల్యాండ్ చేశా రు. బాధిత మహిళలను ఎయిర్ పోర్టు లోని అపోలో దవాఖానకు తరలించి చికిత్స అందించారు. అనంతరం విమానం ఢిల్లీ బయలుదేరినట్టు ఎయిర్లైన్స్ అధికారులు తెలిపారు.