పరిగి : పరిగి నియోజకవర్గం మహ్మదాబాద్ మండలంలో రైతుబంధు సంబురాలలో పాల్గొనేందుకు వచ్చిన రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్రెడ్డిని పరిగిలోని ఎమ్మెల్యే నివాసంలో ఎమ్మెల్యే కొప్పుల మహేశ్రెడ్డి, మాజీ ఎమ్మెల్యే కొప్పుల హరీశ్వర్రెడ్డిలు ఘనంగా సన్మానించారు. మంత్రి నిరంజన్రెడ్డికి శాలువా, పూలమాలతో వారు సన్మానం చేశారు.
కార్యక్రమంలో దోమ జడ్పీటీసీ నాగారెడ్డి, మున్సిపల్ చైర్మన్ ముకుంద అశోక్, సీనియర్ నాయకులు ప్రవీణ్కుమార్రెడ్డి, మండల టీఆర్ఎస్ అధ్యక్షుడు ఆంజనేయులు, పీఏసీఎస్ వైస్ చైర్మన్ భాస్కర్, సర్పంచ్ వెంకట్రాంక్రిష్ణారెడ్డి, కౌన్సిలర్ మునీర్, పీఏసీఎస్ డైరెక్టర్ హన్మంత్రెడ్డి, టీఆర్ఎస్ నాయకుడు రవికుమార్, తాహెర్అలీ, మహిళా విభాగం అధ్యక్షురాలు లక్ష్మీ పాల్గొన్నారు.