పరిగి : యాసంగి సీజన్లో విత్తన డీలర్లు వరికి బదులు ప్రత్యామ్నాయంగా ఆరుతడి పంటలకు సంబంధించిన విత్తనాలు విక్రయించాలని వికారాబాద్ జిల్లా కలెక్టర్ నిఖిల సూచించారు. మంగళవారం డీపీఆర్సీ భవనంలో వికారాబాద్ జిల్లా విత్తనాల డీలర్లతో కలెక్టర్ ప్రత్యేక సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ గతంలో రైతులు వరి కంటే ఆరుతడి పంటలను అధికంగా సాగు చేసేవారని గుర్తు చేశారు.
విత్తన డీలర్లు తమ దుకాణాలలో పొద్దు తిరుగుడు, వేరుశనగ, ఆవాలు, కంది, పెసర, మినుములు, అలసందలు, నువ్వులు, కూరగాయల విత్తనాలు రైతుల కోసం అందుబాటులో ఉంచాలని పేర్కొన్నారు. కార్యక్రమంలో జిల్లా అదనపు కలెక్టర్లు మోతిలాల్, చంద్రయ్య, జిల్లా వ్యవసాయాధికారి గోపాల్, విత్తన డీలర్లు పాల్గొన్నారు.