పరిగి టౌన్ : రేషన్ బియ్యం ఎక్కడైన తీసుకోవచ్చని జిల్లా సివిల్ సప్లై అధికారి రాజేశ్వర్ సూచించారు. జన్సాహాస్ స్వచ్ఛంద సంస్థ ఆధ్వర్యంలో బుధవారం పరిగి మున్సిపల్ పరిధిలోని తుంకులగడ్డలో వన్నేషన్ వన్ రేషన్పై వలస కూలీలకు అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వివిధ రాష్ట్రాలకు చెందిన వలస కూలీల కోసం వన్ నేషన్ వన్ రేషన్ పథకాన్ని కేంద్రం ప్రవేశపెట్టిందని ఏ రాష్ట్రానికి చెందిన వారైన వలస కూలీలు తాము పనిచేసే చోట రేషన్ సరుకులు పొందవచ్చని చెప్పారు. రాష్ట్ర ప్రభుత్వం పోర్టేబుల్టీ ప్రవేశపెట్టిన తర్వాత ఏ జిల్లా వారైన వారు పనిచేసే చోట రేషన్కార్డు కలిగిన వారు రేషన్ సరుకులు పొందే వెసులుబాటు కల్పించిందన్నారు.
రేషన్ సరుకుల పంపిణీలో డీలర్లు ఇబ్బందులకు గురిచేస్తే నేరుగా తనకు ఫోన్ చేయాలని ఆయన సూచించారు. కార్యక్రమంలో ఎన్ఫోర్స్మెంట్ డీటీ సురేష్, డిప్యూటీ తాసీల్దార్ నర్సింహారెడ్డి, ఆర్ఐలు నరేందర్, వెంకటరమణారెడ్డి, జన్సహాస్ జిల్లా కో-ఆర్డినేటర్ ప్రకాశ్కుమార్, మండల కో-ఆర్డినేటర్ రవీందర్, వాలంటీర్లు వంశీ, అశోక్, అసద్, మండల రేషన్డీలర్ల సంఘం అధ్యక్షుడు రాజు, డీలర్లు వేముల సత్యనారాయణగుప్తా, నాగేశ్ పాల్గొన్నారు.