పరిగి టౌన్ : కొవిడ్ బారిన పడకుండా ఉండాలంటే ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా మాస్కులు ధరించాలని ఎస్సై విఠల్రెడ్డి సూచించారు. ఆదివారం పరిగి పట్టణంలోని మార్కెట్యార్డు, బస్టాండ్ ప్రదేశాల్లో మాస్కుల ప్రాముఖ్యత గురించి ప్రజలకు అవగాహన కల్పించారు. ఇంట్లో నుంచి బయటకు వెళ్లే ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా మాస్కు ధరించాలని ఒకవేళ మాస్కు లేకుండా రోడ్లపై తిరిగితే వెయ్యి రూపాయల జరిమాన విధిస్తామని హెచ్చరించారు. అదే విధంగా ఇప్పటి వరకు కొవిడ్ వ్యాక్సిన్ తీసుకోని వారు వెంటనే వ్యాక్సిన్ వేయించుకోవాలని ప్రతి ఒక్కరూ 18 సంవత్సరాల పైబడిన వ్యక్తులు తప్పనిసరిగా రెండు డోసుల వ్యాక్సిన్ వేయించుకోవాలని ఆయన సూచించారు.
అనంతరం వాహనాలను తనిఖీ చేశారు. వాహనాలపై వెళ్లే వ్యక్తులు మాస్కులు లేకుండా వెళ్తుండటాన్ని గమనించిన ఆయన వారికి మాస్కులు అందించారు.