రంగారెడ్డి, అక్టోబర్ 24 (నమస్తే తెలంగాణ): మహిళల సంక్షేమం, ఆర్థిక అభ్యున్నతికి తెలంగాణ ప్రభుత్వం పెద్దపీట వేస్తున్నది. వారు ఆర్థికంగా ఎదగాలన్న సదుద్దేశంతో విలేజ్ ఎంటర్ప్రైజెస్ కార్యక్రమం కింద రుణాలను ఇస్తున్నది. బ్యాంకు లింకేజీ, స్త్రీనిధి కింద రుణాలను మంజూరు చేస్తూ ఆర్థిక వృద్ధికి తోడ్పాటునందిస్తున్నది. ఏటా నిర్దేశించిన లక్ష్యానికి మించి స్వయం సహాయక సంఘాలకు రుణాలను మంజూరు చేస్తున్నది. బీఆర్ఎస్ మ్యానిఫెస్టోలో మహిళా సమాఖ్య సంఘాలకు సొంత భవనాలను నిర్మిస్తామని ప్రభుత్వం హామీనివ్వడంపై హర్షాతిరేకాలు వ్యక్తమవుతున్నాయి. జిల్లాలో ఒక జిల్లా సమాఖ్య ఉండగా.. మండల సమాఖ్యలు 21 ఉన్నాయి. గ్రామ సమాఖ్యలు 788 ఉన్నాయి. రుణాలను అందజేయడంతోపాటు వడ్డీ డబ్బులనూ ఏటా మాఫీ చేస్తూ వస్తున్నది. ఒక్కో సభ్యురాలికి రూ.లక్ష నుంచి రూ.4 లక్షల వరకు రుణాలను మంజూరు చేయగా, ఎంతో మంది స్వయం సహాయక సంఘాల సభ్యులు వ్యాపారులుగా మారారు. మహిళా సంఘాలకు పనిచేసే వీవోఏలకు వేతనాలు అరకొరగానే ఉండేవి. వారి సేవలను గుర్తించిన సీఎం కేసీఆర్ వేతనాలను పెంచారు. ప్రస్తుత మ్యానిఫెస్టోలో మహిళలకు ప్రాధాన్యం ఇవ్వడంతో బీఆర్ఎస్ అభ్యర్థులు ఏ గ్రామానికి వెళ్లినా హారతులు పడుతున్నారు.
మహిళా సంఘాల స్వయం సమృద్ధికి తెలంగాణ ప్రభుత్వం ఇతోధికంగా చేయూత అందిస్తున్నది. సంఘాల ద్వారా బ్యాంకు లింకేజీ రుణాలు అంది స్తూ మహిళల ఆదాయాభివృద్ధికి అవకాశాలు కల్పిస్తున్నది. వారికి ఆర్థిక భరోసానూ అందిస్తూ వ్యాపార, వ్యవసాయ తదితర అవసరాలకు రుణాలను అందిస్తూ అండగా నిలుస్తున్నది. స్వయం సహాయక సంఘాలకు సహాయకులుగా పనిచేస్తున్న వీవోఏల వేతనాలను సైతం ఇటీవల గణనీయంగా పెంచింది. ఈ నేపథ్యంలోనే స్వయం సహాయక మహిళా సమాఖ్యలకు సొంత భవనాలను నిర్మిస్తామని సీఎం కేసీఆర్ బీఆర్ఎస్ పార్టీ ఎన్నికల మ్యానిఫెస్టో లో ప్రకటించడంతో జిల్లాలోని స్వయం సహాయక సంఘాల మహిళలు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.
మహిళా సంఘాలకు ఇతోధికంగా చేయూత..
మహిళల ఆర్థిక అభివృద్ధికి ప్రతి ఏటా లక్ష్యాన్ని నిర్దేశించుకుంటున్న జిల్లా గ్రామీణాభివృద్ధి శాఖ తక్కువ వడ్డీతో బ్యాంకుల ద్వారా సంఘాలకు రుణాలు అందించి స్వావలంబనకు తోడ్పాటునందిస్త్తున్నది. సభ్యుల ఆర్థిక అవసరాల మేరకు వ్యవసాయ, అనుబంధ రంగాలు, కిరాణాషాపులు, పిండిగిర్నీ, టైలరింగ్, బ్యూటీపార్లర్, ఫుట్వేర్ తదితర వ్యాపారాలకు రుణాలను అందిస్తున్నారు. కొత్తగా ఏర్పాటైన సంఘాలు ఆరు నెలలు క్రమం తప్పకుండా పొదుపు చేస్తే వారికి కూడా విరివిగా రుణాలను అందజేస్తున్నారు. గత ప్రభుత్వాల హయాంలో రూ.50వేల నుంచి రూ. 5లక్షల లోపునే మహిళా సంఘాలకు రుణం ఇచ్చేవారు. అయితే తెలంగాణ ప్రభుత్వం మాత్రం రూ.లక్ష నుంచి రూ.20లక్షల వర కు అర్హతను బట్టి రుణాలను మంజూరు చేస్తున్నది. 2022-23 లో 12,061 సంఘాలకు రూ.811కోట్ల రుణాలను అందజేశా రు. 2023-24 సంవత్సరానికి 12,989 సంఘాలకు రుణం ఇవ్వాలని లక్ష్యం పెట్టుకోగా ఈ ఏడాది జూలైనాటికి 2,085 సంఘాలకు రూ.2.66కోట్ల రుణాలను అందజేశారు. గడిచిన తొమ్మిదేండ్లలో ప్రభుత్వం బ్యాంకు లింకేజీ ద్వారా రూ. 3,588 కోట్ల రుణాలను మహిళా సంఘాలకు అందజేసింది. స్త్రీ నిధి ద్వా రా2022-23లో రూ.100.43కోట్ల లక్ష్యాన్ని పెట్టుకుని రూ. 73.48కోట్లను అందజేసింది. 2023-24 సంవత్సరానికి రూ. 112కోట్ల రుణాలు ఇవ్వాలని లక్ష్యంగా పెట్టుకోగా..ఇప్పటివరకు రూ.3.88కోట్ల రుణాలను పంపిణీ చేసింది.
వీవోఏల వేతనం రూ.8వేలకు పెంపు..
ఉమ్మడి రాష్ట్రంలో స్వయం సహాయక సంఘాలకు సహాయకులుగా పనిచేసిన వీవోఏ(విలేజ్ ఆర్గనైజేషన్ అసిస్టెంట్లు)ల వేతనాలు అరకొరగానే ఉ డేవి. సంఘాలకు సంబంధించిన ఆర్థిక అంశాలు, ఇతర సమాచారాన్ని రికార్డుల్లో నమోదు చేసినందుకు ఆయా మహిళా సంఘాల నుంచి గౌరవ వేతనంగా రూ.3వేలు మాత్రమే అందేది. స్వరాష్ట్రంలో వీవోఏ సేవలను గుర్తించిన సీఎం కేసీఆర్ 2016 నుంచి నెలకు రూ.3వేల వేతనాన్ని అందజేస్తూ వచ్చారు. దీంతో అన్నీ కలిపి రూ.6వేల వేతనం వచ్చేది. 2021లో గౌరవ భృతిని ప్రభుత్వం 30శాతం పెంచడంతో వీవోఏల వేత నం రూ.6,900 అయ్యింది. వేతనం పెంపుపై వీవోఏల విజ్ఞప్తులను పరిగణలోకి తీసుకున్న సీఎం కేసీఆర్ మరోసారి వేతనాన్ని పెంచి ఆదుకోవాలని నిర్ణయించారు. ఈ మేరకు ఈ ఏడాది రాఖీ పండుగ కానుకగా రూ. 1,100 వేతనాన్ని పెంచారు. రెండేండ్ల వ్యవధిలోనే ప్రభుత్వం వీవోఏల వేతనాన్ని రూ.2వేలు పెంచగా..ప్రస్తుతం వీవోఏల మొత్తం వేతనం రూ. 8వేలకు చేరింది. జిల్లాలో 753 మంది వీవోఏలుగా పనిచేస్తుండగా.. ప్రభుత్వం కల్పించిన భరోసాతో ఆయా కుటుంబాలు సంతోషంగా ఉన్నాయి.
దశల వారీగా సొంత భవనాలు..
జిల్లాలో ఒక జిల్లా సమాఖ్య ఉండగా.. మండల సమాఖ్యలు 21 ఉన్నాయి. 788 గ్రామ సమాఖ్యలున్నాయి. జిల్లావ్యాప్తంగా 19,192 స్వయం సహాయక సంఘాలుండగా.. వీటిలో 2,06, 691 మంది సభ్యులుగా కొనసాగుతున్నారు. జిల్లా, మండల స్థాయిల్లో చాలావరకు సమాఖ్య భవనాలను ప్రభుత్వం ఇప్పటికే సమకూర్చింది. మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేల చొరవతో గ్రా మ సమాఖ్యలకు సైతం కొన్నిచోట్ల భవనాలున్నాయి. ప్రతినెలా రెండు పర్యాయాలు సమావేశాలు నిర్వహించి బ్యాంకు లింకేజీ, స్త్రీనిధి రుణాలు, రుణ వాయిదాల వసూళ్లపై మహిళా సంఘాల తో చర్చిస్తుంటారు. మళ్లీ అధికారంలోకి వచ్చిన వెంటనే దశలవారీగా సమాఖ్యలకు భవనాలను నిర్మిస్తామని సీఎం కేసీఆర్ మ్యానిఫెస్టోలో ప్రకటించారు. పొదుపు సంఘాలను నడిపించడంలో ప్రముఖ పాత్ర పోషిస్తున్న మహిళా సమాఖ్యలకు భవనాలు సమకూరనుండడంతో ఆయా వర్గాలు సంతోషం వ్యక్తం చేస్తున్నాయి. చెట్ల కింద, అద్దె భవనాల్లో నిర్వహించే సమావేశాల నుంచి విముక్తి కానున్నదని వారు పేర్కొంటున్నారు.
మ్యానిఫెస్టో చాలా బాగున్నది..
సీఎం కేసీఆర్ ప్రకటించిన బీఆర్ఎస్ మ్యానిఫెస్టో చాలా బాగున్నది. కేసీఆర్ మాట ఇచ్చాడంటే కచ్చితంగా నెరవేర్చుతారు. మహిళా సమాఖ్య గ్రూపుల కు సొంత భవనాలను దశలవారీగా నిర్మిస్తామని ప్రకటించడం శుభపరిణామం. అన్ని వర్గాల అభ్యున్నతికి సీఎం కేసీఆర్ ప్రభుత్వం ఎంతో కృషి చేస్తున్నది. -కవిత, మహిళా సంఘం అధ్యక్షురాలు, ఎన్కేపల్లి, చేవెళ్ల
సీఎం కేసీఆర్కే నా మద్దతు సీఎం కేసీఆర్ పాలనలో మహిళలు అన్ని విధాలా అభివృద్ధి చెందుతున్నారు. గత ఉమ్మడి ప్రభుత్వాల పాలకులు మహిళల అభ్యున్నతికి ఎలాంటి కృషి చేయలేదు.బీఆర్ఎస్ మ్యానిఫెస్టోలో మహిళా సమాఖ్యలకు సొంత భవనాలను నిర్మిస్తామని ప్రకటించడం హర్షనీయం. మహిళల సంక్షేమానికి కృషి చేస్తున్న సీఎం కేసీఆర్కే నా మద్దతు.
-కందికంటి లావణ్య, కడ్తాల్
మహిళలమంతా సీఎంకు రుణపడి ఉంటాం
సీఎం కేసీఆర్ మహిళల అభ్యున్నతి కోసం అనేక పథకాలను ప్రవేశపెడుతున్నారు. వడ్డీ లేని రుణాలను అందించి ఆర్థికాభివృద్ధికి చేయూత అందిస్తున్నారు. మూడోసారి అధికారంలోకి వచ్చిన వెంటనే మహిళా సమాఖ్య భవనాలను నిర్మిస్తామని సీఎం కేసీఆర్ ఎన్నికల మ్యానిఫెస్టోలో ప్రకటించడం గొప్ప పరిణామం. మహిళల కోసం పథకాలను అమలు చేస్తున్న సీఎంకు రుణపడి ఉంటాం.
-రావుల లక్ష్మి, నాగరగూడ, షాబాద్
సంఘాలను ప్రగతిపథంలోకి తీసుకెళ్లొచ్చు
సీఎం కేసీఆర్ అన్ని రంగాల్లోనూ మహిళలకు పెద్దపీట వేశారు. అంతేకాకుండా రానున్న ఎన్నికల్లో గెలిచిన వెంటనే మహిళా సమాఖ్య సంఘాలకు సొంత భవనాలను నిర్మిస్తామని మ్యానిఫెస్టోలో ప్రకటించడం చాలా సంతోషకరం. భవనాల నిర్మాణంతో సభ్యులందరూ కలిసి సమావేశాలు నిర్వహించుకునే వీలు కలుగుతుంది. సంఘాలను మరింత ప్రగతిపథంలోకి తీసుకెళ్లొచ్చు.
-అనంతమ్మ, అగ్గనూర్, యాలాల
మహిళల అభివృద్ధికి తోడ్పాటు
సీఎం కేసీఆర్ ఎన్నికల మ్యానిఫెస్టోలో ప్రకటించిన ట్లు మూడోసారి అధికారంలోకి రాగానే మహిళా సమాఖ్యలకు దశలవారీగా సొంత భవనాలను ని ర్మిస్తే.. ఆ భవనాల్లో డ్వాక్రా సంఘాల సభ్యులు సంఘాల పురోభివృద్ధికి సమావేశాలు నిర్వహించుకునేందుకు ఆస్కారం ఉంటుంది. మహిళలకు అండగా ఉంటున్న బీఆర్ఎస్ ప్రభుత్వానికే మహిళలు ఓటు గెలిపిస్తారు. -లక్ష్మి ఎన్కతల,మోమిన్పేట
భవనాలు నిర్మించడం సంతోషకరం
ఎన్నికల్లో గెలిచిన వెంటనే మహిళా సమాఖ్య సం ఘాల సభ్యులకు దశలవారీగా భవనాలను నిర్మిస్తామని సీఎం కేసీఆర్ పార్టీ మ్యానిఫెస్టోలో ప్రకటించడం చాలా సంతోషకరం. భవనాలను నిర్మి స్తే ఎంతో ప్రయోజనంగా ఉంటుంది. ప్రతి నెలా సమావేశాలు నిర్వహించుకునేందుకు వెసులుబాటుగా ఉంటుంది. బుక్ కీపర్లు, గ్రామ అధ్యక్షురాలితోపాటు సభ్యులు నెలవారిగా అక్కడే డ బ్బులను జమచేయడం, లెక్కలు రాయడం, రుణాల డబ్బులను తిరిగి సేకరించడానికి ఈ భవనాలు ఎంతో దోహదపడుతాయి.
-మక్కపల్లి జ్యోతి, మేడిపల్లి నక్కర్త యాచారం
సభ్యులకు ఇబ్బందులుండవు
బీఆర్ఎస్ మ్యానిఫెస్టోలో ఎన్నికల్లో గెలిచిన వెంటనే సొంతభవనాలు నిర్మిస్తామని ప్రకటించడం అభినందనీయం. చాలా గ్రామాల్లో డ్వాక్రా సంఘాల సమావేశాల నిర్వహణకు భవనాలు లేక చెట్ల కింద, కమ్యూనిటీ భవనాలు, పంచాయతీ కార్యాలయాల్లో నిర్వహిస్తున్నారు. సొంత భవనాలను నిర్మించడం ద్వారా సభ్యులకు ఇబ్బందులుండవు.
-వెంకటమ్మ, ఎంపీటీసీ, మహిళా సంఘం సభ్యురాలు, ఘనాపూర్ కులకచర్ల
అండగా ఉంటూ.. ఆదరిస్తున్నారు
మహిళల అభ్యున్నతి కోసం సీఎం కేసీఆర్ చేస్తున్న కృషి ఎనలేనిది. మహిళలు ఆర్థికంగా ఎదగాలని ఆయన అనేక పథకాలను ప్రవేశపెట్టి అమలుచేస్తు న్నారు. తక్కువ వడ్డీకే రుణాలను అందించి ఆదు కుంటున్నారు. అంతేకాకుండా వివిధ అంశాల్లో ఉచి తంగా శిక్షణ ఇచ్చి వారికి మెళకువలు నేర్పిస్తున్నారు. మహిళలకు నీడలా ఉండి ముందుకు నడిపిస్తున్నా సీఎం కేసీఆర్కే మహిళలంతా అండగా ఉండి రాను న్న ఎన్నికల్లో బీఆర్ఎస్ అభ్యర్థులను భారీ మెజార్టీతో గెలిపిస్తారు.
-అశ్విని దొంతాన్పల్లి గ్రామం,శంకర్పల్లి మండలం