ఇబ్రహీంపట్నంరూరల్ : డాక్టర్ బీఆర్ అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ డిగ్రీ ప్రవేశాలకు దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు ప్రభుత్వ డిగ్రీ కళాశాల ప్రిన్సిపాల్ కృష్ణమూర్తి శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఇంటర్, ఓపెన్ ఇంటర్, పాలిటెక్నిక్, ఐటీఐ కోర్సులు పాసైన విద్యార్థులు నేరుగా డిగ్రీ ప్రథమ సంవత్సరంలో ప్రవేశం పొందవచ్చని పేర్కొన్నారు. 2020-21 విద్యా సంవత్సరంలో మొదటి సంవత్సరం అడ్మిషన్ పొందిన విద్యార్థులు ద్వితీయ, తృతీయ సంవత్సరం ట్యూషన్ ఫీజును ఈ నెల 12వ తేదీ వరకు చెల్లించాలని కోరారు. మరిన్ని వివరాల కోసం 7382929772 నంబర్ను సంప్రదించాలన్నారు.