తాండూరు రూరల్, జనవరి 3 : తాండూరు మండలం, మిట్టబాసుపల్లి గ్రామంలో మంగళవారం ఊరడమ్మ జాతర వైభవంగా జరిగింది. పెద్దఎత్తున మహిళలు బోనాలు డప్పువాయిద్యాల మధ్య ఊరేగింపుగా అమ్మవారిని దర్శించుకున్నారు. పోతురాజుల విన్యాసాలు చూపరులను ఆకుటున్నాయి.
గ్రామ దేవతకు పూజలు చేశారు. కార్యక్రమంలో సర్పంచ్ నరేందర్రెడ్డి, ఉప సర్పంచ్ గోవింద్, మాజీ సర్పంచ్ మల్లప్ప, మాజీ ఉప సర్పంచ్ నరహరి పాల్గొన్నారు.