చేవెళ్లటౌన్ : చేవెళ్లలోని చాకలి ఐలమ్మ విగ్రహానికి మంత్రి మహేందర్రెడ్డి, ఎమ్మెల్యే కాలె యాదయ్య పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ చాకలి ఐలమ్మ పోరాట స్ఫూర్తిని యువతరం అలవర్చుకోవాలన్నారు.
చేవెళ్లటౌన్, సెప్టెంబర్ 10 : నిజాం పాలకులు, రజాకార్ల పైశాచికత్వాలపై అలుపెరుగని పోరాటం చేసిన యోధురాలు చాకలి ఐలమ్మ అని మంత్రి పట్నం మహేందర్ రెడ్డి, చేవెళ్ల ఎమ్మెల్యే యాదయ్య అన్నారు. ఐలమ్మ వర్ధంతి సందర్భంగా మండల కేంద్రంలోని ఇంద్రారెడ్డి చౌరస్తాలో ఉన్న ఆమె విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. నిజాం, రజాకార్లపై ప్రాణాలకు సైతం తెగించి పోరాటం చేసిందని గుర్తు చేశారు.
ప్రజలను చైతన్యం చేయడంలో ఆమె పాత్ర వెలకట్టలేనిదని తెలిపారు. 2022 నుంచి తెలంగాణ ప్రభుత్వం కూడా ఐలమ్మ జయంతిని అధికారికంగా నిర్వహిస్తున్నదన్నారు. తన మాటల్ని తూటాలుగా మల్చుకొని దొరల గుండెల్లో గుబులు పుట్టించిందని చరిత్రను వివరించారు. ఐలమ్మ ఆశయ సాధన కోసం ప్రతి ఒక్కరూ కృషి చేయాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో ఎంపీపీ విజయలక్ష్మి, జడ్పీటీసీ మాలతి, మార్కెట్ కమిటీ చైర్మన్ రంగారెడ్డి, నవాబు పేట వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ ప్రశాంత్ గౌడ్, చేవెళ్ల సర్పంచ్లు శైలజ, ప్రభాకర్, శ్రీనివాస్, మార్కెట్ కమిటీ డైరెక్టర్లు వెంకటేశ్, మహేశ్, రజక సంఘం నాయకులు శ్రీనివాస్, రాజేశ్, మధు, శ్రీనివాస్, జంగయ్య, శ్రీశైలం, శ్రీనివాస్ పాల్గొన్నారు.