బొంరాస్పేట, ఫిబ్రవరి 2: గ్రామ పంచాయతీలలో ప్రత్యేకాధికారులుగా నియమితులైన అధికారులు శుక్రవారం పదవీ బాధ్యతలు స్వీకరించారు. సర్పంచ్లు, ఉప సర్పంచ్లు, వార్డు సభ్యు లు పదవీకాలం గురువారంతో ముగియడంతో వారి స్థానంలో ప్రభుత్వం ప్రత్యేకాధి కారులను నియమించింది. బొంరాస్పేట, దుద్యాల మండలాల్లోని 47 గ్రామ పంచాయతీలకు గెజిటెడ్ హోదా కలిగిన అధికారులను ప్రత్యే కాధికారులుగా జిల్లా కలెక్టర్ నియమించారు. ఎంపీడీవో శ్రీదేవి, ఎంపీ వో మహేశ్ కుమార్ ఇతర శాఖల అధికారులు గ్రామ పంచాయతీలకు వెళ్లి సర్పంచ్ల నుంచి పదవీ బాధ్యతలు స్వీకరించారు. కార్యక్రమంలో ఆయా గ్రామాల పంచాయతీ కార్యదర్శులు పాల్గొన్నారు.
పెద్దేముల్:గ్రామాల్లో నివసించే ప్రజలకు కనీస సౌకర్యాలు, అవసరాల దృష్ట్యా ఎలాంటి ఇబ్బందులు కలుగకుండా గ్రామ పంచాయతీ సిబ్బంది చూసుకోవాలని గిర్మాపూర్, గోపాల్పూర్, గొట్లపల్లి, హన్మాపూర్, ఊరెంటితండా, ఇందూర్ గ్రా మాల ప్రత్యేక అధికారి, తహసీల్దార్ కిషన్ సూచించారు. మండల పరిధిలోని ఆయా గ్రామాల్లో శుక్రవారం ఆయన ప్రత్యేక అధికారిగా బాధ్యతలు స్వీకరించారు.
ఈ సందర్భంగా మాట్లాడుతూ.. సర్పంచ్ల పదవీ కాలం ముగియడంతో ప్రత్యేక అధికారులను నియమించారని తెలిపారు. గ్రామాల్లో ముఖ్యంగా తాగునీరు, వీధి దీపా లు, మురుగు కాల్వలు, అంతర్గత రోడ్లను పరిశుభ్రంగా ఉంచాలని పంచాయతీ సిబ్బందికి సూచించారు. సమస్యల పరిష్కారానికి కృషి చేయాలన్నారు. ఆయన వెంట ఆర్ఐ రాజూరెడ్డి, ఆయా గ్రామాల పంచాయతీ కార్యదర్శులు, ఎంపీటీసీల ఫోరం మండల అధ్యక్షుడు ధన్సింగ్ తదితరులు ఉన్నారు.
మర్పల్లి: మండలంలోని 27 గ్రామ పంచాయతీలలో ప్రత్యేకాధికారులు బాధ్యతలు స్వీకరించారు. మర్పల్లి-డీఎల్పీవోఅనిత, కొత్లాపూర్, సిరి పురం, తుమ్మలపల్లి-తహసీల్దార్గణేశ్,మొగిలిగుండ్ల, నర్సాపూర్, నర్సాపూర్ పెద్ద తండా, పట్లూర్-ఎంపీడీవో రాజమల్లయ్య, బిల్కల్, దామస్తాపూర్, గుడ్లమర్పల్లి-వసంత, దార్గులపల్లి, ఘనాపూర్, గుండ్ల మర్పల్లి-రమేశ్, బూచన్పల్లి, కోటమర్పల్లి, వీర్లపల్లి- సుశీల్ కుమార్, జంషాదపూర్,కల్ఖోడా-సాయినాథ్, కొంషట్పల్లి, మల్లికార్జునగిరి -జితేందర్, తిమ్మాపూర్, షాపూర్ -నరేంద్రనాథ్ రెడ్డి, పిల్లిగుండ్ల, రావులపల్లి, పంచలింగాల్, పెద్దాపూర్ గ్రామాల్లో శివకుమార్ బాధ్యతలు స్వీకరించారు.
దోమ :మండల పరిధిలోని 36 గ్రామ పంచాయతీల్లో పలు శాఖల అధికారులు విధులు నిర్వహిస్తూ.. నేటి నుంచి ప్రత్యేక అధికారులుగా అదనపు బాధ్యతలు చేపట్టారని ఎంపీడీవో జయ రాం శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. ట్రైబల్ వెల్ఫేర్ జిల్లా అధికారి కోటాజి దోమ, పాలేపల్లి పంచాయతీల్లో ప్రత్యేక అధికారిగా బాధ్యతలు చేపట్టారని తెలిపారు.
ఎంపీడీవో జయరాంకు బొంపల్లి, బుద్లాపూర్, దిర్సంపల్లి, దాదాపూర్ పంచాయతీలు, తహసీల్దార్ పురుషోత్తంకు గుండాల, దిర్సంపల్లి తండా, దొంగెన్కెపల్లి, దోర్నాల్పల్లి, గూడూరు పంచాయతీలు, డిప్యూటీ తహసీల్దార్ నర్సింహులుకు అయినాపూర్, బాస్పల్లి, బడెంపల్లి, బట్లసందారం పంచాయతీలు, ఎంపీవో సోమలింగంకు ఖమ్మంనాచారం, కిష్టాపూర్, కొండాయపల్లి, కొత్తపల్లి, బ్రాహ్మణపల్లి, లింగన్పల్లి పంచాయతీలకు ప్రత్యేక అధికారులుగా నియమించినట్లు తెలిపారు. ఎంఈవో హరిశ్చందర్కు మైలారం, మల్లేపల్లి, మోత్కూర్ పంచాయతీలు, ఏవో ప్రభాకర్రావుకు ఊట్పల్లి, చిన్నతండా, పెద్దతండా, పల్గుతండాలకు, ఈఈ చలమారెడ్డి పోత్రేపల్లి, రాకొండా, శివారెడ్డిపల్లి పంచాయతీలు, డీవైఎస్వో హెచ్.రావుకు గంజిపల్లి, గొడుగోనిపల్లి, గోన్యనాయక్ తండా,
గొట్లచెల్కతండా పంచాయతీలకు ప్రత్యేక అధికారులుగా నియమించగా ఆయా గ్రామ పంచాయతీల్లో బాధ్యతలు చేపట్టారని ఎంపీడీవో పేర్కొన్నారు.
కులకచర్ల: కులకచర్ల, చౌడాపూర్ మండలాల్లోని గ్రామ పంచాయతీలకు ప్రత్యేక అధికారులను నియమించామని ఎంపీడీవో నాగవేణి తెలిపారు. సర్పంచ్ల పదవీ కాలం పూర్తి కావడంతో ప్రత్యేక అధికారుల పాలన ప్రారంభం కావడంతో మండల స్థాయిలో గెజిటెడ్ అధికారులను ప్రత్యేక అధికారులుగా నియమించామని తెలిపారు.
బీసీ వెల్ఫేర్ జిల్లా అధికారి ఉపేందర్కు చౌడాపూర్, బజ్జ్యనాయక్తండా, అడవివెంకటాపూర్ గ్రామ పంచాయతీలు, చౌడాపూర్ తహసీల్దార్ ప్రభుకు ఈర్లవాగుతండా, బొర్రహేమ్యతండా, గోగ్యనాయక్తండా, లింగంపల్లి, మక్తవెంకటాపూర్ గ్రామ పంచాయతీలు, అసిస్టెంట్ జియోగ్రఫిస్ట్ భాగ్యకు మందిపల్, విఠలాపూర్, వాల్యనాయక్తండా, వీరాపూర్ గ్రామ పంచాయతీలకు ప్రత్యేక అధికారులు నియమించినట్లు తెలిపారు. ఎంపీడీవో నాగవేణికి అల్లాపూర్, అంతారం, సాల్వీడ్, బండవెల్కిచర్ల గ్రామ పంచాయతీలు, పంచాయతీ రాజ్ డిప్యూటీ ఈఈ లక్ష్మయ్యకు బిందెంగడ్డతండా, బొంరెడ్డిపల్లి, బోట్యనాయక్తండా గ్రామ పంచాయతీలు, ఎంఈవో అబీబ్హైమద్కు చాపలగూడెం, చెల్లాపూర్, చెరువుముందలితండా(ఎ), చెరువుముందలితండా(కె) గ్రామ పంచాయతీలు, పంచాయతీరాజ్ ఏఈ మణికుమార్కు ఘనాపూర్, గోరిగడ్డతండా, హన్మ్యనాయక్తండా, ఇప్పాయిపల్లి, కామునిపల్లి గ్రామ పంచాయతీలు,
కులకచర్ల తహసీల్దార్కు కులకచర్ల, లాల్సింగ్తండా, రాంపూర్ గ్రామ పంచాయతీలు, కులకచర్ల డిప్యూటీ తహసీల్దార్ రమేశ్కుమార్కు ఎర్రగోవింద్తండా, దాస్యనాయక్తండా, ఎత్తుకాల్వతండా, అనంతసాగర్ గ్రామ పంచాయతీలకు నియమించామన్నారు. మండల వ్యవసాయాధికారి వీరస్వామికి కుస్మసముద్రం, రాంరెడ్డిపల్లి, బండమీదితండా, తిర్మలాపూర్ గ్రామ పంచాయతీలు, ఎంపీవో కరీంకు ముజాహిద్పూర్, పటెల్చెరువుతండా, పీరంపల్లి, పుట్టపహాడ్, రాంనగర్ గ్రామ పంచాయతీలకు నియమించామని తెలిపారు. ప్రత్యేక అధికారులు పంచాయతీ కార్యదర్శుల ఆధ్వర్యంలో గ్రామాల అభివృద్ధికి కృషి చేస్తారని తెలిపారు. శుక్రవారం కులకచర్ల మండల కేంద్రంలోని గ్రామ పంచాయతీ కార్యాలయంలో గ్రామ పంచాయతీ ప్రత్యేక అధికారిగా మురళీధర్ విధులు నిర్వహించారు. పంచాయతీ కార్యదర్శి శ్రీనివాస్రెడ్డి ద్వారా గ్రామ సమస్యలను అడిగి తెలుసుకున్నారు.